Reunion: నాటి బాల తారల సంగమం… అదిరిందిగా!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Artist Reunion: ఎయిటీస్ నాటి హీరోలు, హీరోయిన్లు ఇప్పటికీ తరచూ కలుస్తుంటారు. హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరులో ప్రతి యేడాది సరదాగా పార్టీ చేసుకుంటారు. సౌతిండియన్ స్టార్స్ అంతా కలిసి ఈ సమయంలో చేసే సందడి అంతా ఇంతా కాదు! విశేషం ఏమంటే… అలాంటి మరో రేర్ రీ-యూనియన్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. అదే నాటి బాల తారల సంగమం! ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజారమణి బాలనటి అనే విషయం తెలిసిందే. ఆమె తనయుడు తరుణ్ సైతం బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డును అందుకున్నాడు. గతంలో చెన్నయ్ లో బాల తారల సంగమాన్ని నిర్వహించిన రోజారమణి… హైదరాబాద్ లోనూ అలాంటి కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టారు. ఆమె నేతృత్వంలో తొలి తెలుగు బాలతారల సంగమం గత ఆదివారం హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్ లో జరిగింది. ‘లవకుశ’ చిత్రంలో కుశుడిగా నటించిన సుబ్రహ్మణ్యంతో పాటు అలనాటి బాల తారలు దాదాపు 30 మంది ఈ రీ-యూనియన్ లో పాల్గొన్నారు.
Also Read
- Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
- Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
- Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించినంత మాత్రాన పెద్దయ్యాక చిత్రసీమలో నిలదొక్కుకోవాలని ఏం లేదు. కొందరు నటన మీద అభిలాషతో చదువు పూర్తి చేసి సినిమాల్లో కొనసాగుతూ ఉంటారు. మరికొందరు వేరే వ్యాపకాల్లో పడి… నటనకు దూరమౌతారు. అయితే బాల నటులుగా రాణించిన కొందరు ఆ తర్వాత హీరోలుగానూ తమ అదృష్టం పరీక్షించుకున్నారు. మాదాల రంగారావు తనయుడు రవి కొన్ని సినిమాలలో హీరోగా చేశాడు. తనీశ్ బాలనటుడిగానే కాదు… హీరోగానూ నటించి మెప్పించాడు. ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డు అందుకున్న కౌశిక్ బాబు సైతం హీరోగా నటించాడు. మరీ ముఖ్యంగా మలయాళంలో అయప్పస్వామి పాత్ర చేసి మెప్పించాడు. అలీ తమ్ముడు ఖయ్యూమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. బాల నటులు, అన్నదమ్ములు కౌశిక్ శ్రీకృష్ణ, బాలాదిత్య నటులుగా కొనసాగుతున్నారు. బాలాదిత్య హీరోగా నటిస్తే… కౌశిక్ శ్రీకృష్ణ బుల్లితెర నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే ఉత్తేజ్ కుమార్తె చేతన ఒకటి రెండు సినిమాల్లో నాయికగా నటించి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుంది. ఈ బాల తారల సంగమంలో కాంతారావు తనయుడు రాజారావ్, ఆనంద వర్థన్, దిలీప్ కుమార్, సునయన, భావన, యాని తదితరులు పాల్గొన్నారు. తమ సినీ రంగ ప్రవేశం గురించి, తదనంతరం పరిణామాల గురించి వీరంత మనసు విప్పి మాట్లాడుకున్నారు. కార్యక్రమం చివరలో పాల్గొన్న అలీ మాట్లాడుతూ, ‘చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇలాంటి ఒక రీ-యూనియన్ ను తాను ఏర్పాటు చేయాలనుకున్నానని, ఈలోగా రోజారమణి గారు చొరవతీసుకుని ఈ కార్యక్రమం చేశారని, ఇకపై ప్రతి యేడాది కలిస్తే బాగుంటుంద’ని అన్నారు.
తాజావార్తలు
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
-
Nepal Floods: నేపాల్లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!