లాలట్టన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ట్రాక్ ఎక్కేశాడు. నేరు తర్వాత భారీ బడ్జెట్ అండ్ ప్రయోగాత్మక చిత్రాలు చేసి దెబ్బతిన్నాడు మోహన్ లాల్. పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో చేసిన ఎంపురన్ మార్చి 27న రిలీజై రూ. 260 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే జోష్ లో తన నెక్ట్స్ సినిమా తుడరుమ్ ను జస్ట్ నెల రోజుల గ్యాప్లో రిలీజ్ చేసాడు. తుడరుమ్ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Also Read : Release Clash : ధనుష్ తో అమీర్ ఖాన్.. రిలీజ్ క్లాష్.. గెలుపెవరిదో.?
15 ఏళ్ల తర్వాత లాలట్టన్తో జోడీ కట్టింది సీనియర్ బ్యూటీ శోభన. దృశ్యం తరహాలోనే ఇది కూడా ఫ్యామిలీ అండ్ రివేంజ్ డ్రామాగా తీసుకువచ్చాడు డైరెక్టర్ తరుణ్ మూర్తి. ఏప్రిల్ 25న రిలీజైన తుడరుమ్ వంద కోట్ల క్లబ్లోకి జాయిన్ అయింది. కాగా తుడరుమ్ సక్సెస్ ఫుల్ గా రెండు వారాలు ఫినిష్ చేసుకుని మూడవ వారంలోకి అడుగుపెట్టింది. వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ షోస్ తో రన్ అవుతూ రెగ్యులర్ డేస్ లో సూపర్ స్ట్రాంగ్ గా కలెక్షన్స్ రాబడుతుంది తుడరుమ్. లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రూ. 150 కోట్ల క్లబ్ లో చేరింది. సింపుల్ ఫ్యామిలీ మ్యాన్ గెటప్లోనే కోట్లు కొల్లగొడుతున్నాడు కంప్లీట్ స్టార్. అందులోనూ తక్కువ బడ్జెట్ చిత్రాలే కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తుడరుమ్ ను రూ. 30 తో బడ్జెట్ తో నిర్మించగా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇక తెలుగులో కూడా బ్రేక్ ఇవెన్ సాధించింది తుడరుమ్.