Aishwarya Rajinikanth: ధనుష్ మాజీభార్య ఇంట్లో దొంగతనం.. లక్షల్లో నగదు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya Rajinikanth: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆమె లేని సమయంలో ఇంటిలోకి చొరబడిన దుండగులు.. ఆమె లాకర్ లోని విలువైన నగలను, కొంత నగదును చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఉదయం ఇంటికి వచ్చిన ఐశ్వర్య తన ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫిర్యాదు అనుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఒక విలువైన నెక్లస్ చోరీకి గురయ్యిందని, దాని విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని ఐశ్వర్య తెలిపింది. ఈ దొంగతనం ఇంట్లో ఉండే పనివారే చేశారని పోలీసులు అనుమానిస్తుండగా.. వారిపై తనకు పూర్తి నమ్మకం ఉంది అని, కానీ ఒకవేళ వారు చేయకపోయినా వేరొకరికి హెల్ప్ చేసి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక ఐశ్వర్య ఇంట్లో దొంగతనం జరగడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అప్పుడు కూడా ఇలాగే డబ్భులు, నగలు చోరీకి గురయ్యాయి. దీంతో పోలీసులు ఆ దిశలో కూడా విచారణ చేపట్టారు. ఐశ్వర్య రజినీకాంత్.. ఈ గతేడాది భర్త ధనుష్ తో విడాకులు తీసుకొని ఒంటరిగా నివసిస్తోంది. ప్రస్తుతం ఆమె లాల్ సలామ్ అనే సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో రజినీకాంత్ నటించడం విశేషం. మరి ఐశ్వర్య ఇంట్లో చోరీకి పాల్పడిన వారు ఎవరైఉంటారు అనేది తెలియాలంటే పోలీసులు దొంగను పట్టుకొనేవరకు ఆగాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..