సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతున్న విషయం విదితమే. ఈ ఈవెంట్ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిధిగా విచ్చేశారు సుకుమార్. ఆయన చేతుల మీదుగా మ.. మ.. మహేశా సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. “మహేష్ బాబును ఇప్పటివరకు ఇంత జోష్ఫుల్ గా చూడలేదు. మీతోపాటు సినిమా చూడటానికి నేను ఆసక్తిగా ఉన్నాను. సెట్లో డైరెక్టర్స్ అందరికీ మహేష్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు.. సెట్ లో మహేష్ ఉంటే .. డైరెక్టర్ కింగ్ లా ఉంటాడు. ‘నేనొక్కడినే’ రోజులు నేను ఎప్పటికి మర్చిపోలేను. ఆ సినిమాకు మీరు ఎంత ఆదరించారో.. ఇప్పుడు కూడా ఆదరిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా పెద్ద సూపర్ హిట్ అవుతుంది” అని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు హీరోకాగా సుకుమార్ దర్శకత్వంలో 1నేనొక్కడినే సినిమా తీసిన విషయం విదితమే. ఆ రోజుల్లో సినిమా నిరాశపర్చిన ఇప్పటికి అది మహేష్ కెరీర్ లోనే కల్ట్ కక్లాసిక్ గా నిలిచింది.