మీడియాపై స్టార్ హీరోయిన్ సెటైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తయిపోయింది. దాంతో ఆమెకు కాస్తంత సమయం చిక్కినట్టుగా ఉంది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ పై సమ్ము దృష్టి పెట్టింది. ఆ మధ్య సమంత సోషల్ మీడియా అకౌంట్స్ లోని తన పేరులోంచి అక్కినేని అనే పదాన్ని తొలగించింది. దాంతో నెటిజన్లతో పాటు కొన్ని సోషల్ మీడియా సైట్స్ సైతం సమంత, నాగ చైతన్య మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయేమో అనే సందేహాలను వ్యక్తం చేశాయి. అప్పుడు సమంత మౌనం వహించింది తప్పితే తన నిర్ణయానికి కారణం మాత్రం చెప్పలేదు.
తాజాగానూ ఇదే అంశంపై కొన్ని వెబ్ సైట్స్ లో వార్తలు వచ్చాయి. అయితే నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలియచేసి, అక్కినేని కుటుంబంతోనే తాను ఉన్నాననే రీతితో ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. అంతేకాదు… ఇటీవల ఓ ఉత్తరాది పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తనపై వస్తున్న రూమర్స్ కు వివరణ ఇవ్వడం తనకు ఇష్టం లేదని, సమయం, సందర్భం వచ్చినప్పుడే వాటిపై స్పందిస్తానని స్పష్టం చేసింది.
Also Read
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
- Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
చిత్రం ఏమంటే… సమంత ఇచ్చిన హింట్స్ తో మీడియా దాదాపు సైలెంట్ అయ్యింది. కానీ ఆమెకు ఈ రూమర్స్ కారణంగా నిద్ర కరువైనట్టుగా కనిపిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రతి రోజూ దీనికి సంబంధించిన ఏదో ఒక కొటేషన్ ను పోస్ట్ చేస్తూ వస్తోంది. తాజాగా మీడియా వాస్తవాలను ఎలా వక్రీకరిస్తుందో తెలియచేస్తూ ఓ ఫోటోను పెట్టింది. పై భాగంలో ఓ కుక్క క్రూరంగా పొడవాటి కోరల్లాంటి పళ్ళతో భయంకరంగా కనిపిస్తూ ఉంది. దాని కిందే రెండు కుక్కలు క్యూట్ గా, హ్యాపీగా ఉన్నాయి. మీడియా సత్ సంబంధాలను సైతం చాలా క్రూరంగా చూపుతోందనే అర్థం వచ్చేలా ఈ ఫోటో ఉంది. దీనిని పోస్ట్ చేసి, ఇన్ డైరెక్ట్ గా మీడియా మీద తన అక్కసును సమంత తీర్చుకున్నట్టుగా అనిపిస్తోంది.
ఏదేమైనా… ఒక్కసారి డైరెక్ట్ గా మీడియా ముందో లేక సోషల్ మీడియా ద్వారానో అక్కినేని కుటుంబంతోనూ, భర్త నాగ చైతన్యతోనూ తనకు ఎలాంటి ఇష్యూస్ లేవని, ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని స్పష్టం చేస్తే సరిపోతుంది. ఆ పని చేయకుండా సమ్ము ఇలా డొంకతిరుగుడుగా పోస్టులు పెడితే ఉపయోగం ఏముంటుంది!?
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..