Sarkaru Vaari Paata: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్దమైన సర్కారువారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షలుకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరును వేగవంతం చేసేశారు మేకర్స్. ఇప్పటికే చిత్ర బృందం ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 7 శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నామని తెలిపారు. దీంతో అభిమానులు రచ్చ చేయడానికి సిద్ధమైపోయారు. ఇప్పటికే ట్రైలర్ లో వింటేజ్ మహేష్ బాబును చూసి పండగ చేసుకుంటున్న అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ స్పీచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక మరోపక్క ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు వస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ పోస్టర్ లో కూడా గెస్ట్ ఎవరు అన్నది చెప్పకపోవడంతో అస్సలు గెస్ట్ లు ఎవరు రావడం లేదా..? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ ఫ్యాన్స్ రచ్చ చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం