Virata Parvam: సరళ సోదరుడి సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విడుదల అనంతరం చిత్రం యూనిట్ హైదరాబాద్ లో శనివారం మీడియాతో మాట్లాడింది. సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్రకు మూలమైన సరళ సోదరుడు మోహనరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా విడుదలకు ముందే దర్శకుడు వేణు ఊడుగుల తనను ‘విరాట పర్వం’ చూడమని చెప్పారని అన్నారు. అయితే వేణు బోలెడంత హోమ్ వర్క్ చేసి, తీస్తున్న ఈ మూవీని ముందుగా చూడటం తన కిష్టం లేకపోయిందని, అందుకే నిన్న రిలీజ్ అయిన తర్వాత చూశామని, తమకు నచ్చిందని తెలిపారు. అయితే కొన్ని అంశాలపై ఆయన తన మనసులోని భావాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ”మా నాన్నగారు కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న వ్యక్తి. కానీ నక్సలైట్లతో కలిసి పని చేసేంత కాదు. అయితే మా చెల్లి మాకు తెలియకుండానే స్టూడెంట్ యూనియన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంది. ఆ క్రమంలో తను విప్లవాన్ని ఇష్టపడింది, ప్రేమించింది. అందుకే ఉద్యమంలోకి మాకు చెప్పకుండా వెళ్ళింది. కానీ సినిమాలో ఆమె ఓ నక్సలైట్ నాయకుడిని, అతని రచనలను, కవిత్వాన్ని ఇష్టపడి అడివిలోకి వెళ్ళినట్టు చూపించారు. రెండింటికీ పెద్ద తేడా లేదనే నేను అనుకుంటున్నాను. తను విప్లవం కోసం వెళ్ళింది. విప్లవం కోసమే చనిపోయింది. విప్లవం వల్లనే చనిపోయింది అన్నది వాస్తవం. అక్కడున్న కొందరి పొరపాటు నిర్ణయం కారణంగా తాను చనిపోయింది” అని అన్నారు.
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
అలానే ఈ సినిమా విడుదలైన తర్వాత ఒకరు ఫోన్ చేసి ‘ఇందులోని క్లయిమాక్స్ వాస్తవానికి భిన్నంగా ఉందని, సరళను నక్సలైట్లు కాల్చిచంపినట్టుగా ఇందులో చూపించడం కరెక్ట్ కాదు కదా!’ అని నన్ను అడిగారు. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మేం అక్కడ లేం. దర్శకుడు వేణు ఈ విషయమై ఎంతో సమాచారాన్ని సేకరించాడు. కాబట్టి అతను సరిగానే చూపించాడని మాకు అనిపించింది” అని అన్నారు. రానా పోషించిన పాత్రపై మాత్రం మోహహనరావు కొంత అభ్యంతరం వ్యక్తంచేశారు. సరళ మరణానికి కారణమైన శంకరన్నను ఇందులో పాజిటివ్ గా చూపించాని, తమ దృష్టిలో అతను విలన్’ అని అన్నారు. ఈ చిత్రంలోని సంగీతం చాలా బాగుందని తన భార్య ప్రశంసించిందని చెప్పారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేశ్ బాబు మాట్లాడుతూ, ”చరిత్రలో నిలిచిపోయేవి బ్లాక్ బస్టర్ మూవీస్ కాదని, జనాలకు గుర్తుండేవి ఆ యేడాదిలో వచ్చిన మంచి చిత్రాలేనని, ‘విరాట పర్వం’ కూడా అలాంటి సినిమానే’నని అన్నారు. తమ బ్యానర్ లో సైతం ఓ బయోపిక్ రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమాలో వెన్నెల పాత్రను పోషించిన తర్వాత తాను సరళ కుటుంబ సభ్యులను కలిశానని, ఒకవేళ ముందే వారిని కలిసి ఉంటే ఇంకా బాగుండేదని తనకు అనిపించిందని సాయిపల్లవి తెలిపింది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు వేణు ఊడుగుల ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు సురేశ్ బొబ్బిలి థ్యాంక్స్ చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!