Virata Parvam: సరళ సోదరుడి సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విడుదల అనంతరం చిత్రం యూనిట్ హైదరాబాద్ లో శనివారం మీడియాతో మాట్లాడింది. సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్రకు మూలమైన సరళ సోదరుడు మోహనరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా విడుదలకు ముందే దర్శకుడు వేణు ఊడుగుల తనను ‘విరాట పర్వం’ చూడమని చెప్పారని అన్నారు. అయితే వేణు బోలెడంత హోమ్ వర్క్ చేసి, తీస్తున్న ఈ మూవీని ముందుగా చూడటం తన కిష్టం లేకపోయిందని, అందుకే నిన్న రిలీజ్ అయిన తర్వాత చూశామని, తమకు నచ్చిందని తెలిపారు. అయితే కొన్ని అంశాలపై ఆయన తన మనసులోని భావాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ”మా నాన్నగారు కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న వ్యక్తి. కానీ నక్సలైట్లతో కలిసి పని చేసేంత కాదు. అయితే మా చెల్లి మాకు తెలియకుండానే స్టూడెంట్ యూనియన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంది. ఆ క్రమంలో తను విప్లవాన్ని ఇష్టపడింది, ప్రేమించింది. అందుకే ఉద్యమంలోకి మాకు చెప్పకుండా వెళ్ళింది. కానీ సినిమాలో ఆమె ఓ నక్సలైట్ నాయకుడిని, అతని రచనలను, కవిత్వాన్ని ఇష్టపడి అడివిలోకి వెళ్ళినట్టు చూపించారు. రెండింటికీ పెద్ద తేడా లేదనే నేను అనుకుంటున్నాను. తను విప్లవం కోసం వెళ్ళింది. విప్లవం కోసమే చనిపోయింది. విప్లవం వల్లనే చనిపోయింది అన్నది వాస్తవం. అక్కడున్న కొందరి పొరపాటు నిర్ణయం కారణంగా తాను చనిపోయింది” అని అన్నారు.
Also Read
- SPIRIT Karnataka Rights : 'స్పిరిట్' కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
- NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న'OG'
అలానే ఈ సినిమా విడుదలైన తర్వాత ఒకరు ఫోన్ చేసి ‘ఇందులోని క్లయిమాక్స్ వాస్తవానికి భిన్నంగా ఉందని, సరళను నక్సలైట్లు కాల్చిచంపినట్టుగా ఇందులో చూపించడం కరెక్ట్ కాదు కదా!’ అని నన్ను అడిగారు. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మేం అక్కడ లేం. దర్శకుడు వేణు ఈ విషయమై ఎంతో సమాచారాన్ని సేకరించాడు. కాబట్టి అతను సరిగానే చూపించాడని మాకు అనిపించింది” అని అన్నారు. రానా పోషించిన పాత్రపై మాత్రం మోహహనరావు కొంత అభ్యంతరం వ్యక్తంచేశారు. సరళ మరణానికి కారణమైన శంకరన్నను ఇందులో పాజిటివ్ గా చూపించాని, తమ దృష్టిలో అతను విలన్’ అని అన్నారు. ఈ చిత్రంలోని సంగీతం చాలా బాగుందని తన భార్య ప్రశంసించిందని చెప్పారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేశ్ బాబు మాట్లాడుతూ, ”చరిత్రలో నిలిచిపోయేవి బ్లాక్ బస్టర్ మూవీస్ కాదని, జనాలకు గుర్తుండేవి ఆ యేడాదిలో వచ్చిన మంచి చిత్రాలేనని, ‘విరాట పర్వం’ కూడా అలాంటి సినిమానే’నని అన్నారు. తమ బ్యానర్ లో సైతం ఓ బయోపిక్ రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమాలో వెన్నెల పాత్రను పోషించిన తర్వాత తాను సరళ కుటుంబ సభ్యులను కలిశానని, ఒకవేళ ముందే వారిని కలిసి ఉంటే ఇంకా బాగుండేదని తనకు అనిపించిందని సాయిపల్లవి తెలిపింది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు వేణు ఊడుగుల ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు సురేశ్ బొబ్బిలి థ్యాంక్స్ చెప్పారు.
తాజావార్తలు
-
Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
-
China Thanks India: చైనా నావికుల ప్రాణాలను కాపాడిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం.. భారత సైన్యానికి చైనా కృతజ్ఞతలు
-
National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఏమనొద్దు.. బీసీసీఐకి జింబాబ్వే కెప్టెన్ రిక్వెస్ట్!
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!