NTR30: తారక్ సరసన ఆ కన్నడ బ్యూటీ.. ఆ బాలీవుడ్ భామ కూడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna To Play Lead Actress In NTR30: జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలోని NTR30 సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్న విషయంపై ఎలా అయితే క్లారిటీ లేదో, అంతే ఈ చిత్రాన్ని హీరోయిన్ సమస్య పట్టి పీడిస్తోంది. ఎవ్వరూ ఓ పట్టాన ఫైనల్ అవ్వడం లేదు. మొదట్లో ఆలియా భట్ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ, సినిమా జాప్యం కావడంతో ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం జాన్వీ కపూర్ పేరు తెరమీదకి వచ్చింది కానీ, ఆ తర్వాత ఆమెని సంప్రదించలేదన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇంకా సమంత, కృతీ శెట్టి సహా మరికొందరు భామల పేర్లు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే.. అవి రూమర్లుగానే మిగిలిపోయాయి.
ఇప్పుడు లేటెస్ట్గా మరో హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆమె మరెవ్వరో కాదు.. రష్మికా మందణ్ణ. ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ వెంటనే పాన్ ఇండియా స్టార్గానూ అవతరించడంతో.. భారీ సినిమాల అవకాశాలు వరుసగా వచ్చి పడుతున్నాయి. దక్షిణాదితో పాటు ఉత్తరాన కూడా ఈ బ్యూటీ హవానే కొనసాగుతోంది కాబట్టి.. దర్శకనిర్మాతలు ఈమె వెంటే పడుతున్నారు. తాజాగా NTR30 చిత్రబృందం కూడా ఆమెనే తీసుకోవాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఆమెతో చర్చలు జరపడం, రష్మికా గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిపోయాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి అమ్మడు భారీ పారితోషికం కూడా అందుకుంటోందని ఇన్సైడ్ న్యూస్! అయితే, దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇదే సమయంలో.. లైగర్లో నటించిన అనన్యా పాండేని సైతం సంప్రదించాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
- God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ - అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
- Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్రూమ్ వార్ అదిరింది
- Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
- Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
కాగా.. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత తారక్, కొరటాల శివ రెండోసారి ఈ NTR30 ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. దీంతో.. ఈ ప్రాజెక్ట్పై మంచి అంచనాలే నెలకొన్నాయి. నిజానికి.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్లాల్సింది కానీ, ఆర్ఆర్ఆర్ కారణంగా వాయిదా పడింది. ఆ సినిమా పుణ్యమా అని, తారక్కి పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో.. పాన్ ఇండియా సినిమాగా మలిచేందుకు మేకర్స్ మళ్లీ కసరత్తులు మొదలుపెట్టారు. స్క్రిప్ట్లో చాలా మార్పులు చేశారు. అయితే, ఇప్పుడా పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నారని చెప్తున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!