Ram Charan : లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విగ్రహాన్ని తాజాగా రామ్ చరణ్ ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రామ్ చరణ్ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మాత్రమే ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. తాజాగా లండన్ కు చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ చేరుకున్నారు.
Read Also : Indus River: సింధు నదీ జలాలు పాకిస్థాన్కు వదులుతారా?
ఈ క్రమంలోనే మేడమ్ టుస్సాడ్స్ లోని తన మైనపు విగ్రహాన్ని రామ్ చరణ్ స్వయంగా ఆవిష్కరించాడు. ఈ మైనపు విగ్రహంలో చరణ్ పెట్ డాగ్ కూడా ఉంది. అందుకే తన పెట్ డాగ్ తో కలిసి స్టేజిమీదకు వెళ్లి సోఫాలో ఉన్న మైనపు విగ్రహాన్ని చరణ్ ఆవిష్కరించారు. చరణ్ కు సినీ ప్రముఖులు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ గ్లింప్స్ రీసెంట్ గా వచ్చి భారీ రెస్పాన్స్ దక్కించుకుంది.
Read Also : Retired out: ఇదేందయ్యా ఇది.. జట్టులోని పదిమంది రిటైర్డ్ అవుట్.. ఎందుకంటే.?