R Narayanamurthy : మంత్రి దుర్గేశ్ మాటలు తప్పు.. నారాయణ మూర్తి సంచలనం..
- పవన్ పై కుట్ర చేయలేదు
- అలా అనడం కరెక్ట్ కాదు
- సమస్యను పక్కదారి పట్టించొద్దు
R Narayanamurthy : ఆర్.నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేయాలని చూశారంటూ మంత్రి కందుల దుర్గేశ్ చేసిన వ్యాఖ్యలు తప్పు అన్నారు. శనివారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘పవన్ కల్యాణ్ మీద ఎవరు కుట్ర చేస్తారు. వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పవన్ కల్యాణ్ ఆఫీసు నుంచి అలాంటి ప్రకటన వస్తుందని అనుకోలేదు. అది కరెక్ట్ కాదు. పర్సెంటేజీల మీద సినిమాలు రిలీజ్ చేస్తేనే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. అప్పుడు నిర్మాతలకు కూడా మంచి జరుగుతుంది.
Bandi Sanjay: కాంగ్రెస్ వంద రోజులలో అరు గ్యారంటీలని అటకెక్కించింది..
Also Read
దాని కోసం థియేటర్ల బంద్ అంశం వచ్చింది. అంతే గానీ పవన్ కల్యాణ్ మీద కుట్రతో కాదు. పవన్ కల్యాణ్ ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడేందుకు అందరినీ పిలిస్తే ఆయనకు మరింత గౌరవం పెరిగేది. ఇప్పుడు సింగిల్ థియేటర్ల మనుగడ కష్టం అయిపోయింది. నేను కూడా పర్సెంటేజీ విధానమే కోరుకుంటా. చాలా మందికి ఇదే విషయం చెప్పాను. పర్సెంటేజీపై ఇప్పుడు ఓ సమాధానం దొరకుతున్న టైమ్ లో.. వీరమల్లు సినిమాకు లింక్ పెట్టడం సమంజసం కాదు. అలా చేస్తే సమస్యలు పక్కదారి పడుతాయి. సింగిల్ స్కీన్ల విషయంలో అందరం ఆలోచించాలి. అవి లేకపోతే సినిమాకు మనుగడ లేదు.
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చర్యలుండాలి. పర్సెంటేజీని బతికించి ఇండస్ట్రీని బతికించాలి. ఎన్టీఆర్ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి సక్సెస్ అయింది పవన్ కల్యాణ్ మాత్రమే. అతనికి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం చాలా సంతోషకరం. ఆయన పర్సెంటేజీ విధానాన్ని అమలు చేసేలా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరు మీద ఇవ్వడం సంతోషం. అందుకే రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులు ఇవ్వాలి.
ప్రస్తుతం సినిమా ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రేక్షకులకు చవకగా దొరికే సినిమా ఇప్పుడు ఖరీదు అయిపోయింది. దాని వల్ల కూడా ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు. ఈ ఖర్చులను మనమే తగ్గించాలి. అందుకు అందరం చర్యలు తీసుకోవాలి. పర్సెంటేజీ విధానం తీసుకురావడం వల్ల నిర్మాత, థియేటర్లకు లాభమే. కానీ ప్రేక్షకులను దూరం చేసుకోవడాన్ని కంట్రోల్ చేయాలి’ అని నారాయణ మూర్తి అన్నారు.
R Narayanamurthy : Khaleja : రీ రిలీజ్ ట్రెండ్ లో ఖలేజాతో మహేశ్ మరో రికార్డు..
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!