R Narayanamurthy : మంత్రి దుర్గేశ్ మాటలు తప్పు.. నారాయణ మూర్తి సంచలనం..
- పవన్ పై కుట్ర చేయలేదు
- అలా అనడం కరెక్ట్ కాదు
- సమస్యను పక్కదారి పట్టించొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Narayanamurthy : ఆర్.నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేయాలని చూశారంటూ మంత్రి కందుల దుర్గేశ్ చేసిన వ్యాఖ్యలు తప్పు అన్నారు. శనివారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘పవన్ కల్యాణ్ మీద ఎవరు కుట్ర చేస్తారు. వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పవన్ కల్యాణ్ ఆఫీసు నుంచి అలాంటి ప్రకటన వస్తుందని అనుకోలేదు. అది కరెక్ట్ కాదు. పర్సెంటేజీల మీద సినిమాలు రిలీజ్ చేస్తేనే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. అప్పుడు నిర్మాతలకు కూడా మంచి జరుగుతుంది.
Bandi Sanjay: కాంగ్రెస్ వంద రోజులలో అరు గ్యారంటీలని అటకెక్కించింది..
Also Read
- Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
- Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
- Peddi: పెద్ది ట్రైలర్'పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
దాని కోసం థియేటర్ల బంద్ అంశం వచ్చింది. అంతే గానీ పవన్ కల్యాణ్ మీద కుట్రతో కాదు. పవన్ కల్యాణ్ ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడేందుకు అందరినీ పిలిస్తే ఆయనకు మరింత గౌరవం పెరిగేది. ఇప్పుడు సింగిల్ థియేటర్ల మనుగడ కష్టం అయిపోయింది. నేను కూడా పర్సెంటేజీ విధానమే కోరుకుంటా. చాలా మందికి ఇదే విషయం చెప్పాను. పర్సెంటేజీపై ఇప్పుడు ఓ సమాధానం దొరకుతున్న టైమ్ లో.. వీరమల్లు సినిమాకు లింక్ పెట్టడం సమంజసం కాదు. అలా చేస్తే సమస్యలు పక్కదారి పడుతాయి. సింగిల్ స్కీన్ల విషయంలో అందరం ఆలోచించాలి. అవి లేకపోతే సినిమాకు మనుగడ లేదు.
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చర్యలుండాలి. పర్సెంటేజీని బతికించి ఇండస్ట్రీని బతికించాలి. ఎన్టీఆర్ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి సక్సెస్ అయింది పవన్ కల్యాణ్ మాత్రమే. అతనికి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం చాలా సంతోషకరం. ఆయన పర్సెంటేజీ విధానాన్ని అమలు చేసేలా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరు మీద ఇవ్వడం సంతోషం. అందుకే రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులు ఇవ్వాలి.
ప్రస్తుతం సినిమా ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రేక్షకులకు చవకగా దొరికే సినిమా ఇప్పుడు ఖరీదు అయిపోయింది. దాని వల్ల కూడా ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు. ఈ ఖర్చులను మనమే తగ్గించాలి. అందుకు అందరం చర్యలు తీసుకోవాలి. పర్సెంటేజీ విధానం తీసుకురావడం వల్ల నిర్మాత, థియేటర్లకు లాభమే. కానీ ప్రేక్షకులను దూరం చేసుకోవడాన్ని కంట్రోల్ చేయాలి’ అని నారాయణ మూర్తి అన్నారు.
R Narayanamurthy : Khaleja : రీ రిలీజ్ ట్రెండ్ లో ఖలేజాతో మహేశ్ మరో రికార్డు..
తాజావార్తలు
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..