Puri Jagannadh: మీరంతా ఒక్కో టికెట్ కొని చూడండ్రా బాబు.. చాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannadh Speech At Liger Pre Release Event: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందిన ‘లైగర్’ సినిమా ఆగస్టు 25వ తేదీన గ్రాండ్ రిలీజ్కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం భారీఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల్ని చేపట్టింది. ఇందులో భాగంగానే గుంటూరులో ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుకని నిర్వహించారు. ఈ వేడుకలో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. మీరంతా ఒక్కో టికెట్ కొని మా సినిమాని చూసినా బ్లాక్బస్టర్ అవుతుందని ఆ ఈవెంట్కి వచ్చేసిన యువతని ఉద్దేశించి అన్నారు. తాము సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కి వచ్చామా లేక సక్సెస్ టూర్కి వచ్చామా? అని తెలియడం లేదని.. ఆ స్థాయిలో ప్రాంగణం నిండిపోయిందని అన్నారు. విజయ్ అభిమానుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ఉన్నారన్నారు.
విజయ్ ఈ సినిమాల ఇరగదీశాడని, అనన్యా పాండే చింపేసిందని, ఇక రమ్యకృష్ణ ఉతికి ఆరేసిందని పూరీ పేర్కొన్నాడు. ఇక తమ సినిమాలో హైలైట్ మైక్ టైసన్ అని, ఆయన ఒక లెజెండ్ అని కొనియాడాడు. తానిప్పుడు మైక్ టైసన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడటానికి ఒక కారణం ఉందంటూ.. ముంబైలో జరిగిన ఓ సంఘటనని గుర్తు చేసుకున్నారు. ముంబైలో ఒక రిపోర్టర్ ‘సార్ మైక్ టైసన్ ఎవరు’ అని అడిగారని.. ఆ ప్రశ్న తనని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు బాధ కలిగించిందని అన్నాడు. ఎంతో కష్టపడి మైక్ టైసన్లాంటి లెజెండ్ని తీసుకొస్తే, ఇతనేంటి? అంత సింపుల్గా ఎవరని అడిగేశాడేంటని తాను షాక్కి గురయ్యానన్నాడు. ఆయన్ను కొట్టే మొనగాడు ప్రపంచంలో ఎవరు లేరని, మైక్ టైసన్ కొట్టిన తర్వాత అక్కడ పైన కొట్టడానికి ఇంకెవరు లేరని మైక్ టైసన్ని ఆకాశానికెత్తేశాడు.
Also Read
- June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
- Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
- Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
- Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
సినిమా చూడటానికి ముందు ఒకసారి గూగుల్లో మైక్ టైసన్ గురించి సెర్చ్ చేసి తెలుసుకోండని పూరీ కోరాడు. మైక్ టైసన్ గొప్పతనం తెలిస్తే, వెండితెరపై ఆయన ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తారని.. అందుకే తాను మైక్ టైసన్ గురించి పదే పదే చెప్తున్నానన్నాడు. ఈ సినిమాని తాము ఎంతో ప్రేమగా రూపొందించామని చెప్పాడు. ‘‘ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఎంత కలెక్ట్ చేస్తుందో కూడా తెలీదు.. కానీ ఈ సినిమా కంటే డబుల్ బడ్జెట్తో జన గణ మన షూటింగ్ ప్రారంభించాం, ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. అంతా కాన్ఫిడెంట్గా లైగర్ మీద ఉంది’’ అని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
-
TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!