‘రొమాంటిక్’ ప్రీమియర్ షో కోసం హైదరాబాద్ కు పూరి, ఛార్మి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ‘లైగర్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ముంబైలో ఈ మూవీ కోసం సాంగ్ పిక్చరైజేషన్ ప్రారంభించారు. ఇటీవల ‘రొమాంటిక్’ మూవీ ప్రీ రిలీజ్ కు వరంగల్ వచ్చిన పూరి, ఛార్మి, విజయ్ దేవరకొండ తిరిగి ముంబైకి చేరుకుని, ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. అయితే… ఈ రోజు ముంబై నుండి పూరి జగన్నాథ్, ఛార్మి తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. పూరి తనయుడు ఆకాశ్ పూరి నటించిన ‘రొమాంటిక్’ మూవీ ఈ నెల 29న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఇవాళ రాత్రి ఎ.ఎం.బి. థియేటర్ లో సెలబ్రిటీస్ ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు.
ఈ చిత్రానికి పూరి, ఛార్మి నిర్మాతలు కూడా కావడంతో ఈ స్పెషల్ షో కు ముంబై నుండి హుటాహుటిన బయలుదేరి వారు వస్తున్నారు. వీలైతే పూరి జగన్నాథ్ ‘రొమాంటిక్’ మూవీ విడుదల వరకూ హైదరాబాద్ లోనే ఉండే ఛాన్స్ ఉంది. మరి ముంబైలో ‘లైగర్’ పాట చిత్రీకరణ పూర్తి అయ్యిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ‘రొమాంటిక్’ చిత్రాన్ని పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ డైరెక్ట్ చేయగా, సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. కేతికా శర్మ ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. పూరి జగన్నాథ్, ఛార్మి ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!