Punam kaur: ఆయన కోసం రాష్ట్రపతిని కలిసిన పూనమ్ కౌర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punam kaur meets President Draupadi murmu: తాజాగా ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పూనమ్ కౌర్, రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ అనే చేనేత కార్మికుడుతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం లోని ఆచంట వేమవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ అతుకులు లేని, 8 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు గల “ఏక వస్త్ర జాతీయ జెండా”ను తన సొంత మగ్గాలపై తయారు చేసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. ఎన్నో వ్యయప్రయాసలకు తట్టుకుని, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మద్దతుతో, సొంత ఇంటిని కూడా తాకట్టు పెట్టి, సత్యనారాయణ “ఏక వస్త్ర జాతీయ జెండా”ను రూపొందించారని తెలుస్తోంది. జాతీయ జెండా మధ్యలో ఉండే అశోక చక్రంతో సహా, అద్భుతమైన రీతిలో ఏ మాత్రం అతుకులు లేకుండా జాతీయ జెండాను ఖాదీ నూలుతో సత్యనారాయణ తయారు చేశారు. జాతీయ జెండా మధ్యలో ఉండే ఆశోక చక్రం కూడా జెండాలో కలిసిపోయేలా అతుకులు లేకుండా రూపొందించేందుకు ప్రత్యేక మగ్గాన్ని తయారు చేసుకున్న సత్యనారాయణ దానితోనే జెండాను రూపొందించారు.
Seerat Kapoor: త్రివర్ణ రంగుల్లో మెరిసిన సీరత్ కపూర్
Also Read
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?

ఒక్కసారైనా ఢిల్లీలోని ఎర్రకోట పై తాను తయారు చేసిన జాతీయ జెండా ఎగరాలన్న సత్యనారాయణ కోరిక తెలుసుకుని ఏపీ ప్రభుత్వ చేనేత అంబాసిడర్” పూనమ్ కౌర్ మద్దతుగా నిలిచారు. చేనేత కార్మికుల సంక్షేమం పట్ల ఎంతో ఆపేక్ష వ్యక్తం చేసే పూనమ్ కౌర్, చేనేత కార్మికుడు సత్యనారాయణ తయారు చేసిన “ఏక వస్త్ర జాతీయ జెండా”ను తయారు చేసిన విషయం తెలుసుకుని స్వయంగా సంప్రదించి, మద్దతుగా నిలవడమే కాదు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అప్పాయుంట్మెంట్ తీసుకుని, నిన్న స్వయంగా కలిసి అతుకులు లు, మిషన్ కుట్టు లేని “ఏక వస్త్ర జాతీయ జెండా”ను సమర్పించారు. ఈ క్రమంలో ఎన్టీవీతో మాట్లాడుతూ, ఎర్రకోట పై ఒక్కసారైనా తాను తయారు చేసిన “జాతీయ జెండా”ను ఎగరవేయాలన్న ఆకాంక్షను రాష్ట్రపతి ముర్ముకు విన్నవించుకున్నానని చేనేత కార్మికుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ తెలిపారు. నా ఆకాంక్షను నెరవేర్చే అంశాన్ని పరిశీలిస్తామని” రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు, సత్యనారాయణ సంతోషంగా చెప్పారు. ఈ క్రమంలో పూనమ్ కౌర్ మాట్లాడుతూ, “సొంత ఇంటిని సైతం తాకట్టు పెట్టి జాతీయ జెండాను తయారుచేసిన సత్యనారాయణకు ఓ ఇల్లును ఇవ్వాలని”, ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!