Parasakthi: “పరాశక్తి” బ్యాన్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్.. కారణాలు ఇవే..
- పరాశక్తి డీఎంకే అనుకూల, హిందూ వ్యతిరేక సినిమా..
- ఈ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలి..
- తమిళనాడు యూత్ కాంగ్రెస్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parasakthi: తమిళనాడులో పొంగల్ బరిలో నిలిచిన సినిమాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ నటించిన ‘‘జన నాయగన్’’ సెన్సార్ కష్టాలను ఎదుర్కొంటోంది. తాజాగా మరో శివకార్తికేయన్ ‘‘పరాశక్తి’’ సినిమాపై వివాదం ముదురుతోంది. కాంగ్రెస్కు సంబంధించిన చారిత్రక సంఘటనలను వక్రీకరించారని ఆరోపిస్తూ, పరాశక్తి సినిమాపై బ్యాన్ విధించాలని తమిళనాడు యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
1960లలో విద్యార్థి ఉద్యమం, హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 10న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏకంగా 25 కట్స్ విధించింది. తమిళనాడు యూత్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు అరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. పరాశక్తి ఒక “డీఎంకే అనుకూల చిత్రం” అని, అందులో “తమిళ అనుకూల, హిందూ వ్యతిరేక వైఖరి” ఉందని ఆరోపించారు. పోస్టాఫీస్ ఫామ్స్లో కేవలం హిందీని మాత్రమే అనుమతించారని తప్పుగా చూపించారని, కాంగ్రెస్ను అప్రతిష్టపాలు చేయడానికి ఇలా చేశారని అన్నారు.
Also Read
- Sunitha : నా నవ్వు, నా ఏడుపు, నా హస్కీ వాయిస్.. అన్నిటినీ సొసైటీ జడ్జ్ చేస్తూనే ఉంది
- Sunitha : మై బాడీ మై రైట్ అంటే, వాడి కళ్ళు వాడి ఇష్టం!" ఫెమినిజంపై సునీత షాకింగ్ కామెంట్స్!
- Samantha: సింగిల్స్కు సమంత పవర్ఫుల్ అడ్వైజ్.. ఆ ఒక్క క్వాలిటీ ఉంటేనే ఓకే చెప్పండి!
- Singer Sunitha: సినీ ఇండస్ట్రీ స్త్రీలకు సేఫ్ కాదు: సింగర్ సునీత
Read Also: Minister Nadendla: రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మంచి ధర రావాలి.. సంతోషంగా ఉండాలి..
‘‘1965లో, అన్ని రాష్ట్రాల్లో పోస్టాఫీసు ఫారాలను కేవలం హిందీలోనే నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. ఇది మా పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా సృష్టించిన పూర్తి కల్పన’’ అని అన్నారు. హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ హీరో శివకార్తికేయన్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీన కలిసినట్లు చూపిస్తున్నారని, ఇది ఆమెను తక్కువ చేసి చూపే సన్నివేశమని అన్నారు. సినిమాలో చెప్పబడుతున్నట్లు ఇందిరాగాంధీ 1965 ఫిబ్రవరి 12 కోయంబత్తూర్ సందర్శనకు రాలేదని అన్నారు. ఇదంతా కల్పితమని కొట్టిపారేశారు. ఆమె సమక్షంలో రైలుకు నిప్పు పెట్టడం జరగలేదని అన్నారు.
ఈ సినిమా క్లైమాక్స్ కూడా వివాదాస్పదంగా మారింది. ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, కే కామరాజ్ రియల్ ఫోటోలను చూపిస్తూ, పొల్లాచిలో 200 మందికి పైగా తమిళుల్ని కాల్చి చంపినట్లు కాంగ్రెస్ను తప్పుగా నిందిస్తోందని భాస్కర్ ఆరోపించారు. ఇలాంటి సన్నివేశాలను తక్షణమే తొలగించాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన పరాశక్తిలో శివకార్తికేయన్, రవి మోహన్, అధర్వ , శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!