‘మా’ ఎన్నికల అధికారిని సీసీటీవీ ఫుటేజ్ కోరిన ప్రకాశ్ రాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు సినిమా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలానే ఈ నెల 16వ తేదీ ఉదయం 11. 45 నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే… ‘మా’ ఎన్నికలలో గెలిచి, అనంతరం పదవులకు రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ బృందం తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రకాశ్ రాజ్ ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోషన్ ను ఎన్నికల సమయంలో రికార్డ్ చేసిన సీసీ ఫుటేజ్ ఇవ్వాల్సింది గా కోరారు.
ప్రకాశ్ రాజ్ ఎన్నికల అధికారికి గురువారం ఓ లేఖ రాస్తూ, ”ఇటీవల పూర్తయిన ‘మా’ ఎన్నికల్లో జరిగిన దురదృష్టకర సంఘటనలకు మీరు సాక్షిగా ఉన్నారు. డి.ఆర్.సి. సభ్యులు శ్రీ మోహన్ బాబు మరియు మాజీ అధ్యక్షులు శ్రీ నరేశ్ అసాంఘిక చర్యలకు పాల్పడ్డారు. ‘మా’ సభ్యులను తిట్టడం, బెదిరించడంతో పాటు భౌతిక దాడికి దిగారు. ఎన్నికల అధికారిగా మీకు ఉన్న విచక్షణా అధికారం కారణంగానే వారి అనుయాయులు పోలింగ్ ప్రాంతంలోకి వచ్చారని నేను భావిస్తున్నాను.
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
Read Also : నోయల్ ’14’ మూవీ టీజర్ విడుదల చేసిన శ్రీవిష్ణు
అలానే అక్కడ జరిగిన కొన్ని సంఘటనల విజువల్స్ మీడియాలోనూ ప్రసారం అయ్యాయి. దాంతో ‘మా’ ఎన్నికలు, తదనంతర పరిణామాలు ప్రజల దృష్టిలో నవ్వులాటగా మారిపోయాయి. పోలింగ్ కేంద్రంలో అసలు ఏం జరిగిందనే విషయం ‘మా’ సభ్యులకు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు.
మీరు ఎన్నికల ముందు మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలను పెడతామని చెప్పారు. వాటిలో అన్ని రికార్డ్ అయి ఉంటాయని నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని పొందడం మాకున్న ప్రజాస్వామిక హక్కుగా నేను భావిస్తున్నాను. ఓ ఎన్నికల అధికారిగా సంబంధిత రికార్డులను కనీసం మూడునెలల పాటు భద్రపర్చడం మీ విధి. సుప్రీం కోర్టు సైతం పలు తీర్పులలో ఎన్నికలకు సంబంధించిన రికార్డులను పోలింగ్ ఆఫీసర్స్ జాగ్రత్త చేయాలని చెప్పింది. కాబట్టి వీలైనంత త్వరగా ఆ సీసీ ఫుటేజ్ ను మాకు ఇవ్వవలసింది. ఒకవేళ మీరు దీనిపై వెంటనే స్పందించకపోతే ఆ ఫుటేజ్ డెలీట్ చేయబడిందని లేదా ట్యాంపర్ అయ్యిందని భావించాల్సి ఉంటుంది” అని ప్రకాశ్ రాజ్ ఆ లేఖ ద్వారా తెలిపారు. మరి దీనికి ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!