సాయికుమార్ తనయుడు ఆది హీరోగా శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శశి’. ఇందులో సురభి, రాశీసింగ్ హీరోయిన్స్. ఈ నెల 19న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘ఒకే ఒక లోకం’ పాట విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ట్రైలర్ ను 10 తేదీ ఉదయం పదిగంటల పది నిమిషాలకు పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారు. రాజీవ్ కనకాల, అజయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ చిలివేరు సంగీతం అందిస్తున్నారు. ఆర్.పి. వర్మ, చావలి రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మాతలు. తమ పాటలకు ఎలాంటి స్పందన లభిస్తుందో సినిమాకు కూడా అదే స్థాయిలో ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉందంటున్నారు దర్శకనిర్మాతలు.