Andhra Pradesh Election 2024: సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఏపీ ఎలెక్షన్స్.. ప్రతి సీనూ క్లైమాక్సే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Election 2024: ఏపీలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగగా సోమవారం రాత్రి 12 గంటల సమయానికి ఏపీ వ్యాప్తంగా 78.25 శాతం పోలింగ్ నమోదైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఇక 1.2శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి మొత్తం 79.4 శాతం ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించారు.
Actor Died: ప్రముఖ నటుడు కన్నుమూత
Also Read
- Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ... ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
- Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్'లో ‘పురుష:’ ట్రైలర్!
- Peddi : భోపాల్'లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
- Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
అయితే రెండు గంటల వరకూ పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో సుమారు 81 శాతం పోలింగ్ నమోదవ్వొచ్చని అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు. అయితే ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికలు సినిమాలకు ఏ మాత్రం తక్కువ కాదు అనే చెప్పాలి. ఇప్పటివరకు కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతాయేమో అనుకున్న అనేక సంఘటనలు నిన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో జరిగాయి. ఈ విషయాన్ని మీడియా కూడా పెద్ద స్థాయిలో ప్రసారం చేసింది. ముఖ్యంగా మూడు లేనివిధంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల మీద దాడులు జరిగాయి.
ఒక చోట ఎమ్మెల్యే ఓటర్ ను చేయి చేసుకోగా సదరు ఓటరు కూడా ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారు. అలాగే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కొన్నిచోట్ల నుంచి వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల వాళ్ళ మీద దాడులు కూడా జరిగాయి. మరికొన్నిచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను ఓటర్లు లేదా వేరే వర్గానికి చెందినవారు ఎదిరించి, రాళ్లతో కొట్టడాలు కూడా జరిగిన ఘటనలు అనేకం రిపోర్ట్ అయ్యాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో అయితే నాటు బాంబులతో పాటు పెట్రోల్ బాంబులతో చెలరేగారు. ఇక చాలాచోట్ల వాహనాలను ధ్వంసం చేయటమే కాక కొన్నిచోట్ల తగలబెట్టిన కేసులు కూడా తెర మీదకు వచ్చాయి.
ఇక కొన్నిచోట్ల ఈవీఎంలను కూడా ధ్వంసం చేసిన కేసులు తెరమీదకు వచ్చాయి. ఇక రెండు పార్టీల కార్యకర్తలు హోరాహోరీగా పోరాడటమే కాదు తలలు పగలగొట్టుకున్నారు. ఈ రోజు కూడా ఈ గొడవలు కొనసాగుతూ ఉండడం గమనార్హం. కొన్నిచోట్ల పోలీసుల దెబ్బలు తిని వెనక్కి పరిగెడితే కొన్ని చోట్ల పోలీసులను కూడా ఎదిరించిన పరిస్థితులు కనబడ్డాయి. మొత్తం మీద ఈ ఎన్నికలు మాత్రం మునుపటి కంటే చాలా భిన్నంగా సినిమాలను తలదన్నే విధంగా ఉండడం గమనార్హం.
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!