Tillu Square: నాగవంశీ సంచలన నిర్ణయం.. మీడియాకి నో షోస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Media Show for Tillu Square: డిజె టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా తెరకెక్కింది. మొదటి సినిమాలో హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో కూడా హీరోగా నటిస్తుండగా హీరోయిన్ మాత్రం మారింది. మొదటి భాగంలో నేహా శెట్టి రాధిక అనే పాత్రలో కనిపించగా ఇప్పుడు లిల్లీ అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డిజె టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ టిల్లు స్క్వేర్ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విషయంలో నిర్మాత నాగ వంశీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించి మీడియా కోసం ఎలాంటి స్పెషల్ షో వేయడం లేదు.
Bade Miyan Chote Miyan Trailer: ఈ ప్రపంచం ఇంతవరకు ఇలాంటి యుద్దాన్ని చూసి ఉండదు!
Also Read
- NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
- Jagapathi Babu : 'పెద్ది'ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
- Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్... అసలేం జరుగుతోంది ?
- Ram Charan : RC17 పై 'పెద్ది' ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న మీడియా కోసం ఒక ప్రెస్ ప్రీమియర్ ప్రదర్శించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. కొన్ని సినిమాలను ముందు రోజే మీడియా కోసం ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని సినిమాలను మాత్రం రిలీజ్ అయిన రోజు ఉదయం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి స్పెషల్ ప్రీమియర్ వేయకూడదు అని నాగవంశీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలా ఏ సినిమా నిర్మాత ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. కొంత కాలం క్రితం ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ సమయంలో పూరీ జగన్నాథ్ మాత్రమే ప్రెస్ కి షో వేయలేదు. సినిమా మీద నమ్మకంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో పాటు రివ్యూస్ మీద కాస్త నెగటివ్ అభిప్రాయం కలిగిన నాగ వంశీ ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రచారమే కాగా నిజంగా ప్రెస్ ప్రీమియర్ ప్లాన్ చేయలేదా ? అనే విషయం మీద రేపటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!