‘మత్తు వదలవరా, తెల్లవారితే గురువారం’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘దొంగలున్నారు జాగ్రత్త’ మూవీలో నటిస్తున్నాడు. అయితే, తాజాగా శ్రీ సింహా హీరోగా మరో సినిమా మొదలైంది. ఈ కొత్త చిత్రానికి ‘ఉస్తాద్’ అనే పేరు పెట్టారు. గురువారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఎ సాయి కొర్రపాటి ప్రొడక్షన్, వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్నారు.
Kiravani
‘ఉస్తాద్’ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, శ్రీవల్లి, నిర్మాత సాయి కొర్రపాటి, కాల భైరవతో పాటు దర్శకులు వెంకటేష్ మహ, శ్రీనివాస్ గవిరెడ్డి, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి కీరవాణి క్లాప్ కొట్టగా, ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. న్యూ ఏజ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.