సినిమా పరిశ్రమలో పైరసీ మహమ్మారి మరోసారి కలకలం రేపింది. విడుదలకు ముందే విజయ్ హీరోగా నటించిన ‘జననాయగన్’కి సంబంధించిన కీలక దృశ్యాలు లీక్ అవ్వడంపై సినిమా యూనిట్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, తన మద్దతు తెలుపుతూనే పైరసీని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు చిరంజీవి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. “జననాయగన్ లీకేజీ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ఎంతో మంది నమ్మకం, కృషి మరియు సమిష్టి కలల రూపం. ఇలాంటి ఘటనలు చిత్ర పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి” అని పేర్కొన్నారు.
Also Read :Love Insurance Kompany Review: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూ
సృజనాత్మక పనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేస్తూ.. “నా ఆలోచనలు, మద్దతు ఎప్పుడూ ఆ సినిమా యూనిట్’కే ఉంటాయి. సినిమాను గౌరవించడం, కాపాడుకోవడం మనందరి బాధ్యతగా తీసుకుందాం. పైరసీని అంతం చేద్దాం.. సినిమాను కాపాడుకుందాం అంటూ ఆయన పిలుపునిచ్చారు. భారీ బడ్జెట్ సినిమాలు లేదా క్రేజీ ప్రాజెక్టుల విషయంలో ఇలాంటి లీకేజీలు జరగడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుంది. మెగాస్టార్ లాంటి పెద్దలు స్వయంగా రంగంలోకి దిగి ఇలాంటి ఘటనలను ఖండించడం వల్ల ప్రేక్షకుల్లో కూడా అవగాహన పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
The unfortunate leak of #Jananayagan is something that deeply concerns me.
Cinema is built on trust, effort, and the collective dreams of many.Such incidents affect all of us in the industry and remind us how crucial it is to protect our creative work.
My thoughts and support…
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2026