Mega Sankranthi Celebrations: బెంగళూరులో సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega Family Celerates Sankranti at Bangalore: మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండుగను ఒక రేంజ్ లో జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి బెంగుళూరులో ఒక ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సంక్రాంతి మొత్తాన్ని బెంగళూరులో జరుపుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో మెగా కుటుంబ సభ్యులందరూ బెంగళూరు చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ సహా వారి పిల్లలు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కుమార్తె ఆద్య కూడా ఈ వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మేరకు మెగా ఫ్యామిలీ రిలీజ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
Fighter :అబ్బురపరిచే విజువల్స్ తో హృతిక్ ‘ఫైటర్’ ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్న యాక్షన్స్..
Also Read
దాదాపుగా 40 నుంచి 50 మంది ఈ ఫోటోలో కనిపిస్తున్నా కేవలం సినీ పరిశ్రమకు పరిచయం ఉన్నవారు మాత్రమే కాదు పరిచయం లేని ఇతర మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక మరికొద్ది రోజుల్లో జరగబోతున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటికే ఆహ్వానం అందింది. ఆయన తర్వాత ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోడలు ఉపాసనకు సైతం ఈ వేడుకకు తాజాగా ఆహ్వానం అందింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. అంతేకాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ వేడుకొక హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!