Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- వాహనదారులకు కేంద్రం శుభవార్త
- జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- జూన్ ప్రారంభంలో ఆంక్షలు విధించిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది. జూలై 1 నుంచి ఈ ఆంక్షలు పూర్తిగా అమల్లో ఉండవని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జూనె నెల ప్రారంభంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు పెట్రోల్ బంకుల నుంచి నేరుగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకుండా నిషేధించింది. తమ అవసరాలకు సంబంధించిన ఇంధనాన్ని బల్క్ సేల్ పాయింట్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించింది.
Also Read
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
జూన్ 11న కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ‘మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్లెట్ల ద్వారా సరఫరాపై తాత్కాలిక నియంత్రణ) ఆర్డర్-2026’ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒకేసారి గరిష్ఠంగా 90 రోజుల వరకు ఇలాంటి పరిమితులు విధించే అవకాశం కల్పించింది.
ఆంక్షలు ఎందుకు విధించారు?
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ పెట్రోలియం సరఫరా గొలుసు, నౌకాశ్రయ రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయని కేంద్రం తెలిపింది. దీంతో పెట్రోల్, డీజిల్ లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. రిటైల్ ధరలు, బల్క్ ధరల మధ్య వ్యత్యాసం ఉండటంతో పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు పెద్దఎత్తున పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల సాధారణ వినియోగదారులకు సరఫరా తగ్గి స్థానికంగా ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వివరించింది.
అప్పటి నిబంధనలు ఇవే
ఆ ఉత్తర్వుల ప్రకారం పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు తమ అవసరాలకు సంబంధించిన పెట్రోల్, డీజిల్ను రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి కాకుండా బల్క్ సరఫరా కేంద్రాల నుంచే కొనుగోలు చేయాల్సి ఉండేది. అలాగే డీజిల్ విక్రయాలను వాహనాల ట్యాంకులకు లేదా PESO (పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్) అనుమతి పొందిన కంటైనర్లకు మాత్రమే పరిమితం చేశారు. ఒక్కో వాహనం లేదా వినియోగదారుడు రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన అమలు చేశారు. కొనుగోలు చేసిన డీజిల్ను తిరిగి విక్రయించడం కూడా నిషేధించారు. తాజా నిర్ణయంతో జూలై 1 నుంచి ఈ తాత్కాలిక పరిమితులు తొలగిపోనున్నాయి. దీంతో పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు కూడా మునుపటిలాగే సాధారణ విధానంలో ఇంధన కొనుగోలు చేసేందుకు అవకాశం లభించనుంది.
The Ministry of Petroleum and Natural Gas has withdrawn the temporary regulatory measures governing the sale and distribution of Motor Spirit (MS) and High Speed Diesel (HSD) through retail outlets of Public Sector Oil Marketing Companies with effect from 1st July, 2026. pic.twitter.com/zgGcjs3s02
— ANI (@ANI) June 29, 2026
తాజావార్తలు
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?