విలక్షణం… ఘట్టమనేని మంజుల పయనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనసు చెప్పిందో ఎవరి మాటా వినవద్దు – అంటారు నటశేఖర కృష్ణ. ఆయన కూతురు ఘట్టమనేని మంజుల తండ్రి మాటలను తు.చ. తప్పక పాటించారనే చెప్పాలి. పిన్నవయసులోనే తెరపై కనిపించిన మంజులలో నటనపై అమితాసక్తి ఉండేది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాలేకపోయారు. ఏమయితేనేమి, తాను అనుకున్నది సాధించి, నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విలక్షణంగా సాగుతున్నారు మంజుల.
ఘట్టమనేని మంజుల 1970 నవంబర్ 8న జన్మించారు. నటశేఖర కృష్ణ రెండో కూతురు. మదరాసులోనే చదువు సంధ్యలు సాగాయి. ఆమెకు ఎనిమిదేళ్ల వయసు ఉన్న సమయంలో 1978లో శభాష్ గోపి చిత్రంలో తొలిసారి నటించారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు మంజుల. అంత పిన్నవయసులోనే ఓ విలక్షణమైన పాత్రలో నటించి, జనాన్ని మెప్పించారు. టీనేజ్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచీ మంజుల మనసు నటనపైకి మళ్ళింది. అయితే కృష్ణను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్, తమ హీరో కూతురు మరొకరి సరసన నటిస్తే చూడలేమని గోల చేశారు. దాంతో కొద్ది రోజులు ఆగారు. ప్రముఖ తమిళనటుడు నంబియార్ మనవడు దీపక్ తో కలసి ఓ తమిళ చిత్రంలో నటించారు మంజుల. ఆ సినిమా ఎందుకనో వెలుగు చూడలేదు. తరువాత ఆర్.కె.సెల్వమణి తెరకెక్కించిన రాజస్థాన్ చిత్రంలో ఓ అతిథి పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి ముందు బాలకృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన టాప్ హీరోలో తొలుత మంజుల నాయిక అనుకున్నారు. అయితే ఫ్యాన్స్ గోల చేయడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు. తరువాత మళయాళ సినిమా సమ్మర్ ఇన్ బెత్లహేమ్ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి, తన అభిలాషను నెరవేర్చుకున్నారు మంజుల. తరువాత తానే నిర్మాతగా మారి 2002లో నీలకంఠ దర్శకత్వంలో షో అనే చిత్రం నిర్మించారు. ఈ చిత్రం కేవలం రెండే పాత్రలతో సాగుతుంది. ఈ సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు లభించింది.
Also Read
- Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
షో తరువాత తనకు నచ్చిన పాత్రల్లో మాత్రమే నటిస్తూ సాగారు మంజుల. 2004లో తన తమ్ముడు మహేశ్ బాబు హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో వైవిధ్యంగా నాని అనే సినిమా నిర్మించారు. 2006లో మహేశ్ హీరోగా రూపొందిన పోకిరిలో నిర్మాణ భాగస్వామిగా నిలిచారు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఇప్పటికీ మహేశ్ బాబు కెరీర్ లో టాప్ మూవీగా నిలచే ఉంది. మంజుల నటించి, నిర్మించిన కావ్యాస్ డైరీ కూడా ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత తొలి చిత్రమైన ఏ మాయ చేశావె నిర్మించారు మంజుల. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తరువాత రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఆరెంజ్లో ఓ ముఖ్యపాత్రలోనటించారు మంజుల. 2013లో తెరకెక్కిన సేవకుడులోనూ ఆమె కనిపించారు. మళ్ళీ మొదలయింది చిత్రంలోనూ మంజుల నటించారు. మంజుల భర్త సంజయ్ స్వరూప్ సైతం నటునిగా సాగుతున్నారు. వారిద్దరూ భార్యభర్తలుగానే ఆరెంజ్లో కనిపించారు. ఇటీవలే ఓటీటీలో విడుదలైన జై భీమ్లో జడ్జి పాత్రలో కనిపించారు సంజయ్. ఆయన నిర్మాతగా మంజుల దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా మనసుకు నచ్చింది అనే చిత్రం రూపొందింది. ఏది ఏమైనా మంజుల తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని నటిగా,నిర్మాతగా, దర్శకురాలిగా విలక్షణంగా సాగారనే చెప్పాలి.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!