Kalki 2898 AD: ఇద్దరు హీరోల ఆశలు అడియాశలే!!!
- మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు కల్కి 2898 ఏడి
- జూన్ 23వ తేదీన అమరావతిలో ఒక ఈవెంట్ ప్లాన్
- వర్షాభావ పరిస్థితులతో క్యాన్సిల్ చేసే యోచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD Event Cancelled at Amaravathi: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబచ్చన్, దిశాపటాని, దీపికా పదుకొనే వంటి స్టార్లు నటించడంతో పాటు టీజర్, ట్రైలర్ కట్స్ సినిమా మీద అంచనాలను పెంచాయి. నిజానికి ట్రైలర్ మీద మిశ్రమ స్పందన ఉన్నా ప్రస్తుతానికి ఆ సినిమా మీద బజ్ అయితే గట్టిగానే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ అమరావతిలో ప్లాన్ చేస్తున్నారని, జూన్ 23వ తేదీన జరగబోయే ఈ ఈవెంట్ కి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని ప్రచారం జరిగింది. ఈ విధంగా అమరావతిలో జరిగే మొట్టమొదటి సినిమా ఈవెంట్గా కల్కి నిలిచే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు చాలా కాలం తర్వాత పవన్, ప్రభాస్ కూడా ఒకే స్టేజి మీద కలిసి కనిపించబోతున్నారని అన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల అభిమానులకు షాక్ కలిగించే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేమిటంటే అమరావతిలో ఈవెంట్ చేయడం లేదని తెలుస్తోంది.
Actor Darshan: ఒక మేనేజర్ మిస్సింగ్.. మరో మేనేజర్ ఆత్మహత్య.. మరిన్ని చిక్కుల్లో దర్శన్?
Also Read
- Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
- Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
- Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. 'జైలర్' విలన్ వినాయకన్పై మరో కేసు
- Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా 'శ్రీశ్రీ'.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే చేస్తున్నారని, పార్క్ హయత్ లేదా ఐటీసీ కోహినూర్ హోటల్స్ లో ఈవెంట్ నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో ఈవెంట్ చేయకపోవడానికి కారణం వర్షాభావ పరిస్థితులనే చెబుతున్నారు. దానికి తోడు ప్రభాస్ కూడా అక్కడ వరకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి హైదరాబాద్లో ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను ఆహ్వానించే యోచనలో ఉన్నారు. అయితే వారు వస్తారా రారా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. భారీ అంచనాలతో ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే అమెరికాలో ప్రీ సేల్ విషయంలో కొన్ని రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు సినీ రికార్డులను బద్దలు కొడుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా ఆయన భార్య ప్రియాంక, మరదలు స్వప్న తమ తండ్రి అశ్వినీ దత్ తో కలిసి వైజయంతి బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్పై వేటు?
-
Ketan Murder Case: కేతన్ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
-
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!