బాలకృష్ణ విడుదల చేసిన ‘జెట్టి’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న చిత్రం ‘జెట్టి’. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ‘నా ఆశ కంటే మా నాన్న ఆశయం ముఖ్యం’ అనే హీరోయిన్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఊరికి జెట్టిని తీసుకురావాలనే తండ్రి ఆశయం కోసం కూతురు రాజీలేని పోరాటం చేస్తుంది. జెట్టి వల్ల పర్యాటకం పెరిగి ఊరు బాగుపడుతుందన్నది ఆయన ఉద్దేశం.
Read Also : కెమెరాకు కలిసి ఫోజిచ్చిన భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్… పిక్ వైరల్
Also Read
అయితే జనం బాగుపడటం ఇష్టంలేని విలన్లు జెట్టి కాదు కదా మట్టిని కూడా తీసుకురానివ్వమని అడ్డుపడుతుంటారు. హీరో సహాయంతో ప్రతినాయకుల స్వార్థాన్ని జయించి ఊరికి జెట్టిని తీసుకొచ్చిందా? లేదా? అన్నది చిత్ర కథాంశం. మత్స్యకారుల జీవనం, స్థితిగతులు, వారి జీవనంలో భావోద్వేగాలను ఆవిష్కరించినట్లు ట్రైలర్ తెలియచేస్తోంది. బాలకృష్ణ ట్రైలర్ చూసి బాగుందని ప్రశంసించడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని ఆయనకు యూనిట్ తరుపున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు నిర్మాత. త్వరలో థియేటర్ లలో సినిమాను విడుదల చేస్తామంటున్నారు.



తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..