TJ Gnanavel: ‘జై భీమ్’ డైరెక్టర్ కొత్త సినిమా.. ఈసారి భర్తను చంపినవాడిపై భార్య న్యాయపోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TJ Gnanavel: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ టిజె జ్ఞానవేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. రియల్ స్టోరీలను ప్రజలకు చూపించడంలో ఈ దర్శకుడు ముందు ఉంటాడు. నిజాన్ని నిక్కచ్చిగా చూపించడంలో టిజె జ్ఞానవేల్ తరువాతే ఎవరైనా.. ఇప్పటికే జై భీమ్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు జ్ఞానవేల్. ఒక దళిత మహిళా న్యాయ పోరాటాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించి విమర్శల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఈ సినిమా ఆస్కార్ కూడా నామినేట్ కావడం విశేషం. ఇక తాజాగా ఈ సినిమా తరువాత మరో రియల్ స్టోరీని తెరకెక్కిస్తున్నట్లు జ్ఞానవేల్ ప్రకటించాడు. ఈసారి భర్తను చంపిన ఒక వ్యాపారిపై భార్య చేసిన న్యాయ పోరాటాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఆ భార్య ఎవరో కాదు జీవజ్యోతి.. తమిళనాడులో సంచలనం సృష్టించిన కేసును దోశా కింగ్ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇది హిందీలో తెరకెక్కడం విశేషం. జీవజ్యోతి అనే మహిళ తన భర్తను చంపిన దోశా కింగ్ రాజగోపాల్ కు శిక్ష పడేలా చేయడానికి 18 ఏళ్ళు న్యాయ పోరాటం చేసింది.
అసలు ఎవరు జీవ జ్యోతి.. ఏంటీ ఆమె కథ అంటే.. చెన్నైలోని శరవణ భవన్ రెస్టారెంట్ చెయిన్ యజమాని పిచ్చై రాజగోపాల్. ఆయనకు ఎన్నో రెస్టారెంట్స్, వ్యాపారాలు ఉన్నాయి. అయితే అతనికి జాతకాల పిచ్చి ఎక్కువ.. ఒకానొక రోజు తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి కూతురు జీవజ్యోతిని పెళ్లాడితే.. తనకు రాజయోగం పడుతుందని, తన దశ తిరిగిపోతుందని ఒక పండితుడు చెప్పగా.. ఆమె వెంట పాడడం మొదలుపెట్టాడు రాజగోపాల్. అప్పటికే జీవజ్యోతికి పిన్స్ శాంత కుమార్ తో వివాహమైపోయింది. అయినా ఆమె వెంట పడడం మానలేదు. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని, తనకు మూడో భార్యగా రావాలంటూ వేధించాడు. డబ్బుకు లొంగని జీవజ్యోతి అతడిని చీదరించుకొంది. భర్తను వదిలి రానని చెప్పింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన రాజగోపాల్ 2001 అక్టోబర్ లో జీవజ్యోతి భర్తను హత్య చేయించాడు. భర్త మృతి చెందిన తరువాత జీవజ్యోతి నయయపోరాటం మొదలయ్యింది. రాజగోపాల్ పై కేసు వేసింది. అన్ని ఆధారాలతో అతడు అరెస్ట్ అయ్యాడు. కోర్టు అతడికి జీవిత ఖైదును విధించింది. కానీ అది ఎంతో కాలం నిలవలేదు.
Also Read
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
- Bhagyanagaramlo Sarathi Prema: ఆకట్టుకుంటున్న లవ్ ఎమోషనల్ డ్రామా
అనారోగ్యం కారణంగా రాజగోపాల్ బెయిల్ పై బయటికి వచ్చాడు. దాదాపు 18 ఏళ్లు అతడు బయటే ఉన్నాడు. మళ్లీ 2019 లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం వలన అతడు మళ్లీ జైలుకు వెళ్లాడు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక 18 ఏళ్లు జీవజ్యోతి చేసిన న్యాయపోరాటమే ‘దోశా కింగ్’ సినిమా. జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ స్టోరీపై ఒక పుస్తకం కూడా వచ్చింది. దాని పేరు ‘మర్డర్ ఆన్ ది మెనూ’. ఇక ఈ సినిమాపై జీవజ్యోతి మాట్లాడుతూ తన పడిన కష్టం కన్నా నిజం ఏంటో చూపించాలని, ఇప్పటికైనా నిజం ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : పంజా విసురుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!