BIG Breaking: టాలీవుడ్లో మరో విషాదం.. వెండితెర సత్యభామ కన్నుమూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heroine Jamuna passed away: టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఇవాల ఉదయం సీనియర్ సినీనటి జమున మృతిచెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. జమున మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె మృతి వార్త విన్నగానే టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికలుగా కొనసాగిన కథానాయికలు ఎందరో ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే తమ నటనా ప్రతిభతో పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అలాంటి వారిలో జమున ఒకరు. నిజానికి తన మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు నేలపైనే ఎదిగి సినీ పరిశ్రమలో అరుదైన కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె.
జమున 1937లో కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో జన్మించింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆంధ్రాకు వెళ్లడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాలో బాల్యం గడిచింది. జమున అసలు పేరు జానాబాయి. అయితే జన్మ నక్షత్రాన్ని బట్టి ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో.. ఆమె పేరు మధ్యలో ము అనే అక్షరాన్ని చేర్చారు. అలా ఆమె పేరు జమున అయింది. నటుడు జగ్గయ్యది అదే గ్రామం కావడంతో జమున కుటుంబానికి ఆయనతో కొంత పరిచయం ఉంది.
Also Read
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి'
సినీ ప్రస్థానం :
జమున చదువుకునే రోజుల నుంచే నాటకాల వైపు ఆకర్షితురాలైంది. దాంతో ఆమెకు నాటకాల్లో పాల్గొనాలనే కోరిక కలిగింది. అప్పుడు తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ఖిల్జీరాజ్యపట్టణం అనే నాటకానికి జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపిక చేశారు. ఆ నాటకంలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి కూడా నటించారు. ఆ నాటకమే కాకుండా అనేక ఇతర నాటకాలలో కూడా నటించింది. ఆ నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకు పాకడం వల్లే సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి.
ఆమె మొదటి సినిమా ‘పుట్టినిల్లు’. తర్వాత అక్కినేని, ఎన్టీఆర్, జగ్గయ్య తదితర ప్రముఖ నటీనటులతో కథానాయికగా పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆమె సత్యభామ పాత్ర పోషించడమే ఆమెను మరింత పాపులర్ చేసింది. ఇప్పటికీ చాలా మంది ఆ పాత్ర గురించే చర్చించుకుంటున్నారు. ఆ తర్వాత ‘శ్రీకృష్ణ తులాభారం’లోనూ అదే పాత్రను పోషించి మరిన్ని మంచి మార్కులు కొట్టేసింది. ఆ పాత్ర ఆమెను ఇండస్ట్రీలో నిలబెట్టింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లో కూడా నటించింది. ఆ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆమె చాలా కాలం పాటు సినీ నటిగా ప్రస్థానం కొనసాగించారు. దివంగత ఇందిరాగాంధీ పట్ల అభిమానం, గౌరవంతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు.
తాజావార్తలు
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
-
India Women Cricket: 5 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!