BIG Breaking: టాలీవుడ్లో మరో విషాదం.. వెండితెర సత్యభామ కన్నుమూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heroine Jamuna passed away: టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఇవాల ఉదయం సీనియర్ సినీనటి జమున మృతిచెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. జమున మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె మృతి వార్త విన్నగానే టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికలుగా కొనసాగిన కథానాయికలు ఎందరో ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే తమ నటనా ప్రతిభతో పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అలాంటి వారిలో జమున ఒకరు. నిజానికి తన మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు నేలపైనే ఎదిగి సినీ పరిశ్రమలో అరుదైన కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె.
జమున 1937లో కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో జన్మించింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆంధ్రాకు వెళ్లడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాలో బాల్యం గడిచింది. జమున అసలు పేరు జానాబాయి. అయితే జన్మ నక్షత్రాన్ని బట్టి ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో.. ఆమె పేరు మధ్యలో ము అనే అక్షరాన్ని చేర్చారు. అలా ఆమె పేరు జమున అయింది. నటుడు జగ్గయ్యది అదే గ్రామం కావడంతో జమున కుటుంబానికి ఆయనతో కొంత పరిచయం ఉంది.
Also Read
- Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
- Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
- Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
- Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
సినీ ప్రస్థానం :
జమున చదువుకునే రోజుల నుంచే నాటకాల వైపు ఆకర్షితురాలైంది. దాంతో ఆమెకు నాటకాల్లో పాల్గొనాలనే కోరిక కలిగింది. అప్పుడు తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ఖిల్జీరాజ్యపట్టణం అనే నాటకానికి జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపిక చేశారు. ఆ నాటకంలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి కూడా నటించారు. ఆ నాటకమే కాకుండా అనేక ఇతర నాటకాలలో కూడా నటించింది. ఆ నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకు పాకడం వల్లే సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి.
ఆమె మొదటి సినిమా ‘పుట్టినిల్లు’. తర్వాత అక్కినేని, ఎన్టీఆర్, జగ్గయ్య తదితర ప్రముఖ నటీనటులతో కథానాయికగా పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆమె సత్యభామ పాత్ర పోషించడమే ఆమెను మరింత పాపులర్ చేసింది. ఇప్పటికీ చాలా మంది ఆ పాత్ర గురించే చర్చించుకుంటున్నారు. ఆ తర్వాత ‘శ్రీకృష్ణ తులాభారం’లోనూ అదే పాత్రను పోషించి మరిన్ని మంచి మార్కులు కొట్టేసింది. ఆ పాత్ర ఆమెను ఇండస్ట్రీలో నిలబెట్టింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లో కూడా నటించింది. ఆ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆమె చాలా కాలం పాటు సినీ నటిగా ప్రస్థానం కొనసాగించారు. దివంగత ఇందిరాగాంధీ పట్ల అభిమానం, గౌరవంతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!