ప్రజల గొంతుక … గద్దర్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గద్దర్ పేరు వినగానే ఆయన ముందున్న ప్రజాగాయకుడు అన్న బిరుదు గుర్తుకు వస్తుంది. ప్రజల పక్షాన నిలచి, వారి కష్టాలను తన గళంలో నింపి ఊరూరా వాడవాడలా పల్లవించి, ప్రభుత్వాలను దారికి తీసుకు వచ్చిన కళాకారుడు గద్దర్. ఆయన పుట్టిన తేదీపై పలు అభిప్రాయాలు ఉన్నాయి. అయితే చాలామంది జనవరి 30వ తేదీన గద్దర్ పుట్టినరోజు అని చెబుతారు. ప్రజా గాయకుడు గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. బ్రిటిష్ రాజ్యంలో తెల్లవారి పాలనను వ్యతిరేకిస్తూ గదర్ పార్టీ ఒకటి వెలుగు చూసింది. ఆ పార్టీ పేరునే తన కలం పేరుగా మార్చుకున్నారు గద్దర్. ఆయన పాటలు పలు చిత్రాలలో పల్లవించాయి. కొన్ని సినిమాల్లో గద్దర్ కనిపించారు కూడా! అలా చిత్రసీమతోనూ గద్దరన్నకు అనుబంధం ఉంది.
గద్దర్ 1949లో మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో జన్మించారు. పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించాలని భావించారు. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1969లో సాగిన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. చదువుకొనే రోజుల నుంచీ ప్రజల కష్టాలను అర్థం చేసుకొని, వారి సమస్యలపై పాటలు, బుర్రకథలురాసి అలరించారు గద్దర్. తరువాతి రోజుల్లో ప్రముఖ నిర్మాత, దర్శకునిగా పేరొందిన బి.నరసింగరావు, గద్దర్ ను ఎంతగానో ప్రోత్సహించారు. 1971లో నరసింగరావు ప్రోత్సాహంతోనే ఆపర...రిక్షా...అనే పాట రాశారు. ఆ ఆల్బమ్ గద్దర్ పేరుతోనే విడుదలయింది. అప్పటి నుంచీ గుమ్మడి విఠల్ రావు కాస్తా గద్దర్గా నిలచిపోయారు. 1980లో బి.నరసింగరావు నిర్మించి, నటించిన మా భూమి చిత్రంలో గద్దర్ ఓ పాత్ర పోషించారు. అందులోనే బండి యాదగిరి రాసిన బండెనక బండి కట్టి... పదహారు బండ్లు కట్టి... పాటను గద్దర్ స్వయంగా ఆలపించి, నటించారు. ఆ తరువాతి రోజుల్లో ఈ పాట విశేషాదరణ చూరగొంది. నక్సల్బరీ ఉద్యమంలోనూ గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఆ నేపథ్యంలో కటకటాలూ లెక్కపెట్టారు. ఆయన పై హత్యాయత్నమూ జరిగింది. అయితే అశేష ప్రజాభిమానంతో గద్దర్ బతికి బట్ట కట్టగలిగారు.
Also Read
దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆర్.నారాయణ మూర్తి నటించిన ఒరేయ్...రిక్షా కోసం గద్దర్ పాటలు పలికించారు. అందులోని మల్లెతీగెకు పందిరివోలె... నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా... పాట ఎంతగానో అలరించింది. తరువాత జై బోలో తెలంగాణ చిత్రం కోసం పొడుస్తున్న పొద్దు మీద ...పోరుతెలంగాణమా... పాటను రాయడమే కాదు, ఆ పాట పాడుతూ సినిమాలోనూ కనిపించారు. గద్దర్ పలికించిన అమ్మా తెలంగాణా... ఆకలి కేకల గానమా... పాటను తెలంగాణ ఏర్పడ్డ తరువాత రాష్ట్ర గీతంగా ఎంపిక చేశారు. ఇప్పటికీ గద్దర్ ప్రజా సమస్యలపై స్పందిస్తూనే ఉంటారు. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!