ప్రజల గొంతుక … గద్దర్ !
గద్దర్ పేరు వినగానే ఆయన ముందున్న ప్రజాగాయకుడు అన్న బిరుదు గుర్తుకు వస్తుంది. ప్రజల పక్షాన నిలచి, వారి కష్టాలను తన గళంలో నింపి ఊరూరా వాడవాడలా పల్లవించి, ప్రభుత్వాలను దారికి తీసుకు వచ్చిన కళాకారుడు గద్దర్. ఆయన పుట్టిన తేదీపై పలు అభిప్రాయాలు ఉన్నాయి. అయితే చాలామంది జనవరి 30వ తేదీన గద్దర్ పుట్టినరోజు అని చెబుతారు. ప్రజా గాయకుడు గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. బ్రిటిష్ రాజ్యంలో తెల్లవారి పాలనను వ్యతిరేకిస్తూ గదర్ పార్టీ ఒకటి వెలుగు చూసింది. ఆ పార్టీ పేరునే తన కలం పేరుగా మార్చుకున్నారు గద్దర్. ఆయన పాటలు పలు చిత్రాలలో పల్లవించాయి. కొన్ని సినిమాల్లో గద్దర్ కనిపించారు కూడా! అలా చిత్రసీమతోనూ గద్దరన్నకు అనుబంధం ఉంది.
గద్దర్ 1949లో మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో జన్మించారు. పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించాలని భావించారు. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1969లో సాగిన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. చదువుకొనే రోజుల నుంచీ ప్రజల కష్టాలను అర్థం చేసుకొని, వారి సమస్యలపై పాటలు, బుర్రకథలురాసి అలరించారు గద్దర్. తరువాతి రోజుల్లో ప్రముఖ నిర్మాత, దర్శకునిగా పేరొందిన బి.నరసింగరావు, గద్దర్ ను ఎంతగానో ప్రోత్సహించారు. 1971లో నరసింగరావు ప్రోత్సాహంతోనే ఆపర...రిక్షా...అనే పాట రాశారు. ఆ ఆల్బమ్ గద్దర్ పేరుతోనే విడుదలయింది. అప్పటి నుంచీ గుమ్మడి విఠల్ రావు కాస్తా గద్దర్గా నిలచిపోయారు. 1980లో బి.నరసింగరావు నిర్మించి, నటించిన మా భూమి చిత్రంలో గద్దర్ ఓ పాత్ర పోషించారు. అందులోనే బండి యాదగిరి రాసిన బండెనక బండి కట్టి... పదహారు బండ్లు కట్టి... పాటను గద్దర్ స్వయంగా ఆలపించి, నటించారు. ఆ తరువాతి రోజుల్లో ఈ పాట విశేషాదరణ చూరగొంది. నక్సల్బరీ ఉద్యమంలోనూ గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఆ నేపథ్యంలో కటకటాలూ లెక్కపెట్టారు. ఆయన పై హత్యాయత్నమూ జరిగింది. అయితే అశేష ప్రజాభిమానంతో గద్దర్ బతికి బట్ట కట్టగలిగారు.
Also Read
- Buchi Babu: 'పెద్ది'ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
- Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. 'పెద్ది' లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
- Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న 'పెద్ది' రిలీజ్..
- Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆర్.నారాయణ మూర్తి నటించిన ఒరేయ్...రిక్షా కోసం గద్దర్ పాటలు పలికించారు. అందులోని మల్లెతీగెకు పందిరివోలె... నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా... పాట ఎంతగానో అలరించింది. తరువాత జై బోలో తెలంగాణ చిత్రం కోసం పొడుస్తున్న పొద్దు మీద ...పోరుతెలంగాణమా... పాటను రాయడమే కాదు, ఆ పాట పాడుతూ సినిమాలోనూ కనిపించారు. గద్దర్ పలికించిన అమ్మా తెలంగాణా... ఆకలి కేకల గానమా... పాటను తెలంగాణ ఏర్పడ్డ తరువాత రాష్ట్ర గీతంగా ఎంపిక చేశారు. ఇప్పటికీ గద్దర్ ప్రజా సమస్యలపై స్పందిస్తూనే ఉంటారు. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
-
Heinrich Klaasen: ఆటో ప్రయాణం, రెస్టారెంట్.. సాధారణ వ్యక్తిలా హైదరాబాద్ చుట్టేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
-
Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!