Veera Simha Reddy: బాలయ్య ఆ ‘వన్డే’ స్టోరీని వద్దన్నారు.. గోపీచంద్ రివీల్ చేసిన సీక్రెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gopichand Malineni Reveals A Secret About Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే! సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బృందం పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. తమ సినిమాకు మంచి ఆదరణ వస్తుండటంతో.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు గోపీచంద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా ఓకే అవ్వడానికి ముందు తాను బాలయ్యకు మరో స్టోరీ వినిపించానని, అది రిజెక్ట్ చేయడం వల్ల వీరసింహారెడ్డి కుదిరిందంటూ కొన్ని సీక్రెట్స్ రివీల్ చేశాడు.
Sarfaraz Khan: నీ కోచ్కే దిక్కులేదు..నువ్వెంత: సర్ఫరాజ్పై చీఫ్ సెలెక్టర్ ఫైర్
Also Read
- Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి 'టాయ్ స్టోరీ' 5 వరకు..
- Hema Slams Anasuya: 'జై శ్రీరామ్' ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు... అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
- Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
- Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘‘మొదట్లో బాలయ్యతో సినిమాతో అనుకున్నప్పుడు, రేసీగా ఒక రోజులోనే సాగే స్టోరీతో సినిమా చేయాలనుకున్నాను. ఆ స్టోరీని బాలయ్యకు వినిపించడం కూడా జరిగింది. అయితే.. స్టోరీ విన్న తర్వాత ఇది సరిపోదని బాలయ్య అన్నారు. ‘అఖండ’ లాంటి సినిమా తర్వాత నా నుంచి ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటారు కాబట్టి, లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని బాలయ్య సూచించారు. దాంతో గతంలో రాసి పెట్టుకున్న ఒక స్టోరీని బయటకు తీసి, బాలయ్యకు వినిపించాను. స్టోరీ లైన్ చెప్పగానే, ఈ సినిమా మనం చేస్తున్నామని బాలయ్య చెప్పారు. ‘నేను సీమ నేపథ్యంలో సినిమా చేసి చాలా రోజులైంది, ఇప్పుడు ఇది చేస్తే బాగుంటుంది, కచ్ఛితంగా దీన్నే చేద్దాం’ అని బాలయ్య అన్నారు. దీంతో మూడు రోజుల్లోనే స్టోరీ పూర్తి చేసి, సెట్స్పైకి తీసుకెళ్లాం. ఇది తండ్రికొడుకుల కథ కావడంతో, పాత సినిమాలే గుర్తొస్తాయని, చెల్లెలు సెంటిమెంట్ని జోడించాం’’ అంటూ చెప్పుకొచ్చాడు.
Public Urination : గోడలపై మూత్రం పోయాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
అంతేకాకుండా.. ఈ సినిమా కోసం తాము చాలా రిస్క్ తీసుకున్నామని గోపీచంద్ వెల్లడించాడు. బాలయ్య సినిమాల్లో సాధారణంగా రెండో పాత్ర ఇంటర్వెల్లో ఎంటర్ అవుతుందని, అయితే ఇందులో ఇంటర్వెల్లోనే ఆ పాత్రని ముగించామని చెప్పాడు. దాన్ని జస్టిఫై చేయడం కోసం.. ద్వితీయార్థాన్ని చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్లే ప్రయత్నం చేశానని డైరెక్టర్ పేర్కొన్నాడు. కాగా.. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా, ఆయన సరసన శృతిహాసన్, హనీ రోజ్ కథానాయికలుగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
-
Hema Slams Anasuya: ‘జై శ్రీరామ్’ ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు… అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
ట్రెండింగ్
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!