Veera Simha Reddy: బాలయ్య ఆ ‘వన్డే’ స్టోరీని వద్దన్నారు.. గోపీచంద్ రివీల్ చేసిన సీక్రెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gopichand Malineni Reveals A Secret About Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే! సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బృందం పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. తమ సినిమాకు మంచి ఆదరణ వస్తుండటంతో.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు గోపీచంద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా ఓకే అవ్వడానికి ముందు తాను బాలయ్యకు మరో స్టోరీ వినిపించానని, అది రిజెక్ట్ చేయడం వల్ల వీరసింహారెడ్డి కుదిరిందంటూ కొన్ని సీక్రెట్స్ రివీల్ చేశాడు.
Sarfaraz Khan: నీ కోచ్కే దిక్కులేదు..నువ్వెంత: సర్ఫరాజ్పై చీఫ్ సెలెక్టర్ ఫైర్
Also Read
- Killer Movie Accident: ఎస్.జె.సూర్య 'కిల్లర్' సెట్స్లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
- 4 Years of Vikram: లోకనాయకుడి 'విక్రమ్' కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
- Ntv Exclusive: 'పెద్ది'తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
- PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘‘మొదట్లో బాలయ్యతో సినిమాతో అనుకున్నప్పుడు, రేసీగా ఒక రోజులోనే సాగే స్టోరీతో సినిమా చేయాలనుకున్నాను. ఆ స్టోరీని బాలయ్యకు వినిపించడం కూడా జరిగింది. అయితే.. స్టోరీ విన్న తర్వాత ఇది సరిపోదని బాలయ్య అన్నారు. ‘అఖండ’ లాంటి సినిమా తర్వాత నా నుంచి ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటారు కాబట్టి, లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని బాలయ్య సూచించారు. దాంతో గతంలో రాసి పెట్టుకున్న ఒక స్టోరీని బయటకు తీసి, బాలయ్యకు వినిపించాను. స్టోరీ లైన్ చెప్పగానే, ఈ సినిమా మనం చేస్తున్నామని బాలయ్య చెప్పారు. ‘నేను సీమ నేపథ్యంలో సినిమా చేసి చాలా రోజులైంది, ఇప్పుడు ఇది చేస్తే బాగుంటుంది, కచ్ఛితంగా దీన్నే చేద్దాం’ అని బాలయ్య అన్నారు. దీంతో మూడు రోజుల్లోనే స్టోరీ పూర్తి చేసి, సెట్స్పైకి తీసుకెళ్లాం. ఇది తండ్రికొడుకుల కథ కావడంతో, పాత సినిమాలే గుర్తొస్తాయని, చెల్లెలు సెంటిమెంట్ని జోడించాం’’ అంటూ చెప్పుకొచ్చాడు.
Public Urination : గోడలపై మూత్రం పోయాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
అంతేకాకుండా.. ఈ సినిమా కోసం తాము చాలా రిస్క్ తీసుకున్నామని గోపీచంద్ వెల్లడించాడు. బాలయ్య సినిమాల్లో సాధారణంగా రెండో పాత్ర ఇంటర్వెల్లో ఎంటర్ అవుతుందని, అయితే ఇందులో ఇంటర్వెల్లోనే ఆ పాత్రని ముగించామని చెప్పాడు. దాన్ని జస్టిఫై చేయడం కోసం.. ద్వితీయార్థాన్ని చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్లే ప్రయత్నం చేశానని డైరెక్టర్ పేర్కొన్నాడు. కాగా.. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా, ఆయన సరసన శృతిహాసన్, హనీ రోజ్ కథానాయికలుగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
-
Monsoon: అన్నదాతలకు శుభవార్త.. 24 గంటల్లో కేరళను ముద్దాడనున్న తొలకరి వాన
-
Killer Movie Accident: ఎస్.జె.సూర్య ‘కిల్లర్’ సెట్స్లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
-
CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Annamalai: అన్నామలై రాజీనామా చేయలేదా..?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!