Forty Years For Swayamvaram Movie : నలభై ఏళ్ళ ‘స్వయంవరం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Forty Years For Swayamvaram Movie
మనసు ఒకరికి, మనువు ఒకరితో అంటూ ఎంతోమంది అమ్మాయిలు కన్నవారి కోసం కోరుకున్నవారిని కాదనుకున్న సందర్భాలు ఉన్నాయి. కొందరు సర్దుకుపోతుంటారు, మరికొందరు నలిగిపోతూనే ఉంటారు. అమ్మాయిల మనసునూ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, పంతాలు పట్టింపులు వదిలేయాలి అంటూ నీతులు చెబుతూ ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అదే తీరున సాగి, కాసింత వైవిధ్యాన్ని మిళితం చేసి దాసరి నారాయణరావు ‘స్వయంవరం’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా 1982 ఆగస్టు 6న విడుదలై విశేషాదరణ చూరగొంది.
ఇంతకూ ‘స్వయంవరం’ కథ ఏమిటంటే – అగ్నిప్రమాదానికి గురై భార్య చనిపోతోందని తానూ చావాలనుకుంటాడు సుబ్బారావు, కానీ అతడిని బావా అంటూ ఆప్యాయంగా పిలిచే ధర్మారావు అతనిని ఆ ప్రయత్నం నుండి విరమింపచేసి ఇంటికి తీసుకువెళతాడు. ధర్మారావుకు ఓ కొడుకు చంద్రశేఖర్, సుబ్బారావుకు ఓ కూతురు ప్రియ ఉంటారు. ధర్మారావు తన భార్య చేతి గాజులు అమ్మి టీ కొట్టు పెడతాడు. అందులోనే సుబ్బారావు పనిచేస్తూంటాడు. చందు, ప్రియ చిన్నప్పుడే ఓ పెళ్ళిలో దంపతులను చూసి, తామూ ఎన్నడూ విడిపోకూడదని పెళ్ళి చేసుకుంటారు. వారిని కన్నవారు కూడా ఆశీర్వదిస్తారు. ధర్మారావు, సుబ్బారావు కలసి కోట్లు సంపాదిస్తారు. కానీ, వాళ్ళ మేనేజర్ కారణంగా వారి మధ్య చిచ్చు రగులుతుంది. వ్యాపారంలో ధర్మారావుని, సుబ్బారావు మోసం చేస్తాడు. ధర్మారావు వాటాకు నష్టాలు చూపిస్తాడు. ధర్మారావు పరిస్థితి తారుమారవుతుంది. ఓడలు బండ్లు కాగానే సుబ్బారావు మాట మారుస్తాడు. చందు, ప్రియ మధ్య అతనే అగాథం సృష్టిస్తాడు. తరువాత కూతురును బలవంతంగా రాజశేఖర్ అనే ధనవంతునికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. అతనికి పలు వ్యసనాలు ఉంటాయి. పెళ్ళయితే బాగుపడతాడనే తల్లి అతనికి వివాహం చేస్తుంది. చందు పిచ్చివాడయి తిరుగుతూ ఉంటాడు.
Also Read
- Peddi : "పెద్ది"పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ... ప్రశంసల వర్షం
- Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
- Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
- LENIN : అఖిల్ 'లెనిన్' ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
అతను ఓ రోజు వానలో పాటలు పాడుకుంటూ ఉండగా, శేఖర్ అది చూసి, అతడిని చేరదీస్తాడు. అక్కడ ప్రియను చూసి షాక్ అవుతాడు చందు. కొన్నాళ్ళకే రాజశేఖర్ కు, చందు అలా పిచ్చివాడు కావడానికి తన భార్యను ప్రేమించడం కారణమని తెలుస్తుంది. వారి ప్రేమను అర్థం చేసుకొని, వారిని ఒకటిగా చేసే ప్రయత్నం చేస్తాడు. తాను ప్రియను వదిలేస్తే ఏం చేస్తావ్ అని ఓ సారి చందును, శేఖర్ అడుగుతాడు. తాను పెళ్ళి చేసుకుంటానంటాడు చందు. వారిద్దరూ ఒకటి కాకుండా మోసం చేసిన సుబ్బారావును పిలచి, నిజాలు తేలుస్తాడు శేఖర్. ప్రియను చందును ఒకటి చేయాలనుకుంటాడు. అందుకు ప్రియ తండ్రి సుబ్బారావు అంగీకరించడు. పెళ్ళయిన తరువాత భార్యపై భర్తకే అన్ని అధికారాలు ఉంటాయని, ఆమెను కోరుకున్నవాడికి ఇచ్చి పెళ్ళి చేయడం కూడా తన ధర్మమే అని శేఖర్ అంటాడు. ప్రియ వద్దంటుంది. ఆడదానికి తాళి వేసేది ఒక్కసారే, తీసేది ఒక్కసారే అని చెబుతుంది. దాంతో శేఖర్ ఆత్మాహుతి చేసుకుంటాడు. తాను కన్నుమూస్తూ ఓ ఉత్తరాన్ని చందుకు ఇస్తాడు. అందులో “సంప్రదాయాలు మంచివే, కానీ వాటివల్ల జీవితాలు నాశనం కాకూడదని చందును చేసుకొని సుఖంగా ఉండమని కోరతాడు. ఒకవేళ సంప్రదాయమే గొప్పదనుకుంటే, ఏలాంటి కల్మశం లేని పసితనంలోనే పెళ్ళాడిన మీదే అసలైన పెళ్ళి, నాదే రెండో పెళ్ళి” అనీ రాసివుంటుంది. దాంతో కథ ముగుస్తుంది.
శోభన్ బాబు, జయప్రద, గుమ్మడి, రావు గోపాలరావు, అంజలీదేవి, రమాప్రభ, పుష్పలత, రూపాచక్రవర్తి, సత్యచిత్ర, గౌరి, బేబీ మీనా, మాస్టర్ పురుషోత్తం, మాస్టర్ ఫణికుమార్ నటించిన ఈ చిత్రంలో దాసరి నారాయణరావు విలక్షణమైన పాత్రలో అభినయించారు.
లక్ష్మీ గణేశ్ చిత్ర పతాకంపై ఈ చిత్రాన్ని డి.రామరాజు, డి.విజయరామరాజు నిర్మించారు. ఈ చిత్రానికి సత్యం స్వరకల్పన చేయగా, రాజశ్రీ, దాసరి పాటలు పలికించారు. ఈ సినిమా దాసరి నారాయణరావు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పేరు తలచుకోగానే ఈ నాటికీ ఇందులో ఏసుదాస్ గానం చేసిన “గాలివానలో వాననీటిలో…” అనే పాటనే ముందుగా గుర్తుకు వస్తుంది. “నేనిక్కడ…నువ్వక్కడ…”, “ఆకాశం ఎందుకో…”, “ముసుగేసిన మబ్బుల్లో…” అంటూ సాగే పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది.
ఈ కథలోని ముగింపుతోనే ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘కన్యాదానం’ తెరకెక్కింది. అయితే, అందులో చనిపోవడాలేవీ లేకుండా తాను పెళ్ళి చేసుకున్న అమ్మాయి మరొకరిని ప్రేమించిందని తెలియగానే, భర్తగా తన భార్యను ఎవరికైనా ఇచ్చే అధికారం ఉందని ఆమె కోరుకున్నవాడితో పెళ్ళి జరిపిస్తాడు హీరో. ఇక దాసరి ‘స్వయంవరం’ టైటిల్ తోనే తరువాతి రోజుల్లో వేణు హీరోగా ఓ చిత్రం రూపొందింది. ఆ సినిమాతోనే దర్శకుడు కె.విజయ్ భాస్కర్, రచయిత త్రివిక్రమ్ మంచి గుర్తింపు సంపాదించడం విశేషం!
తాజావార్తలు
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!