Film Chamber: డిమాండ్కు తగ్గట్టు రేట్లు పెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పైరసీ, టికెట్ రేట్ల సమస్యలతో పాటు సోషల్ మీడియా చేస్తోన్న దుష్ప్రచారాల గురించి చర్చించేందుకు ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాతలు ఆదిశేషగిరి రావు, తమ్మారెడ్డి భరద్వాజ, మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవితో పాటు మరికొంతమంది పొల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ‘‘పైరసీని అరికట్టడంలో ఫిల్మ్ ఛాంబర్ ఫెయిల్ అయ్యింది. దాన్ని అరికట్టడంలో మరింత కృషి చేయాలి. నిర్మాతల మండలి కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది. సినిమా టికెట్ రేట్లపై ఎవరిష్టం వచ్చి మాట్లాడుతున్నారు. టికెట్ రేట్స్ పెంచడం మంచిది కాదని దిల్రాజు ఇప్పుడు చెప్తున్నాడు. టికెట్ రేట్స్ పెంచమని ప్రభుత్వాలని అడిగేటప్పుడు, ఫ్లెక్సిబుల్ రేట్లు ఉండాలని అడిగితే బావుండేది. అలా చేసి ఉంటే, సమస్యలు వచ్చేవి కావు. డిమాండ్కు తగ్గట్టే రేట్లు కేటాయించాలి. గతంలో లాగా అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి’’ అని అన్నారు.
Also Read
- Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
- Karikala First Look: సందీప్ కిషన్ 'కరికాల' ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
- Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
- Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్... ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన 'ఇచ్ఛాధారి నాగిన్'..
ఓటీటీలపై మొదట్నుంచీ సెన్సార్ లేదని చెప్పిన ఆదిశేషగిరి రావు.. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించాలన్నారు. సోషల్ మీడియాలో అయితే సినిమాపై ట్రోలింగ్ చాలా ఎక్కువైందన్నారు. సోషల్ మీడియాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కంటెంట్ మీద విమర్శించడం మంచిదే కానీ, వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ కూడా.. సోషల్ మీడియా వార్తలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. సెలెబ్రిటీలు కూడా మనుషులేనని, వారికీ కుటుంబాలుంటాయని, కేవలం వ్యూస్ కోసం నెగెటివ్ ప్రచారాలు చేస్తున్నారని, వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఇక మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మీడియా అనేది అత్యవసరం. సోషల్ మీడియా మాత్రం అవాస్తవాల అడ్డాగా మారింది. ఎంతో కష్టపడి పేరు, గౌరవం పొందిన వారిపై అసభ్యంగా వార్తలు వేస్తున్నారు. శ్రీకాంత్ ,శారద, కవిత చనిపోయినట్లు తప్పుడు వార్తలు రాశారు. మా అధ్యక్షుడు విష్ణు గురించి కూడా చులకనగా ప్రచారం చేశారు. రాంగ్ థంబ్ నెయిల్స్ ఇకనైనా మారాలి. దీనిపై చిత్ర పరిశ్రమ ఏకమై ఖండిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!