Film Chamber: డిమాండ్కు తగ్గట్టు రేట్లు పెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పైరసీ, టికెట్ రేట్ల సమస్యలతో పాటు సోషల్ మీడియా చేస్తోన్న దుష్ప్రచారాల గురించి చర్చించేందుకు ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాతలు ఆదిశేషగిరి రావు, తమ్మారెడ్డి భరద్వాజ, మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవితో పాటు మరికొంతమంది పొల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ‘‘పైరసీని అరికట్టడంలో ఫిల్మ్ ఛాంబర్ ఫెయిల్ అయ్యింది. దాన్ని అరికట్టడంలో మరింత కృషి చేయాలి. నిర్మాతల మండలి కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది. సినిమా టికెట్ రేట్లపై ఎవరిష్టం వచ్చి మాట్లాడుతున్నారు. టికెట్ రేట్స్ పెంచడం మంచిది కాదని దిల్రాజు ఇప్పుడు చెప్తున్నాడు. టికెట్ రేట్స్ పెంచమని ప్రభుత్వాలని అడిగేటప్పుడు, ఫ్లెక్సిబుల్ రేట్లు ఉండాలని అడిగితే బావుండేది. అలా చేసి ఉంటే, సమస్యలు వచ్చేవి కావు. డిమాండ్కు తగ్గట్టే రేట్లు కేటాయించాలి. గతంలో లాగా అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి’’ అని అన్నారు.
Also Read
- Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
- The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న 'ది ఇండియా స్టోరీ' టీజర్
- Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ఓటీటీలపై మొదట్నుంచీ సెన్సార్ లేదని చెప్పిన ఆదిశేషగిరి రావు.. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించాలన్నారు. సోషల్ మీడియాలో అయితే సినిమాపై ట్రోలింగ్ చాలా ఎక్కువైందన్నారు. సోషల్ మీడియాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కంటెంట్ మీద విమర్శించడం మంచిదే కానీ, వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ కూడా.. సోషల్ మీడియా వార్తలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. సెలెబ్రిటీలు కూడా మనుషులేనని, వారికీ కుటుంబాలుంటాయని, కేవలం వ్యూస్ కోసం నెగెటివ్ ప్రచారాలు చేస్తున్నారని, వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఇక మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మీడియా అనేది అత్యవసరం. సోషల్ మీడియా మాత్రం అవాస్తవాల అడ్డాగా మారింది. ఎంతో కష్టపడి పేరు, గౌరవం పొందిన వారిపై అసభ్యంగా వార్తలు వేస్తున్నారు. శ్రీకాంత్ ,శారద, కవిత చనిపోయినట్లు తప్పుడు వార్తలు రాశారు. మా అధ్యక్షుడు విష్ణు గురించి కూడా చులకనగా ప్రచారం చేశారు. రాంగ్ థంబ్ నెయిల్స్ ఇకనైనా మారాలి. దీనిపై చిత్ర పరిశ్రమ ఏకమై ఖండిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
-
Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!