Director Mahi V Raghav Comments on Yatra 2 Movie: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వై.ఎస్.జగన్ పేదల కోసం చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించగా మంగళవారం నాడు ‘యాత్ర 2’ చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో మహి వీ రాఘవ్ మాట్లాడుతూ ‘తెలిసిన కథే అయినా.. సినిమాను ఎలా తీశామన్నది ఎవ్వరికీ తెలియదని, ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండవచ్చు కానీ సినిమాను ఎలా తీశాం, ఏ ఎమోషన్తో నడిపించామన్నది తెలియదన్నారు. ఈ టీజర్, ట్రైలర్లో చూసిన సీన్లు ప్రజలకి తెలిసి ఉండకపోవచ్చు. ఓ చెవిటి అమ్మాయితో ఉన్న సీన్, ఓ అంధుడితో సీన్ ఇవన్నీ బయట ప్రజలకు తెలియదని ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్, ఎన్నో తెలియని అంశాలతో ‘యాత్ర 2’ని తీశానని అన్నారు. ట్రైలర్లో చూపించిన ఆ ఎమోషనల్ సీన్లు నిజంగానే జరిగాయా? లేదా? అన్నది పక్కన పెడితే ఆ సీన్తో ఎమోషన్ను జనాలకు కనెక్ట్ చేశామా? అన్నది సినిమా ఉద్దేశమన్నారు ఆయన.
Director Vassishta: విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ఇంట ఆనంద హేల
వైఎస్సార్ పేదల కోసం, వికలాంగుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని చెప్పే ఉద్దేశంలో ఆ సీన్ అనుకోవచ్చని అయితే వైఎస్ జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది ఆయన వెనకాల నిలిచారు అనేది చెప్పడం కోసం ఆ అంధుడి పాత్ర చూపించామని అన్నారు. ఇక ఈ సినిమాలో వైఎస్సార్ మరణానికి సంబంధించిన కారణాలు చూపించలేదు కేవలం ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుందన్నారు. ఢిల్లీని ఎదురించడం, సీఎం అయిపోవడం అనేది నా కథ కాదన్న ఆయన సినిమాలో ఎవ్వరినీ కించపరిచేలా పాత్రలు సృష్టించలేదన్నారు. నిజానిజాలు జనాలకు తెలుసని, ఒక పాత్రని హీరో చేయడం కోసం ఇంకో పాత్రను తక్కువ చేసి చూపించలేదని అన్నారు. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా, రీ రిలీజ్ చేసినా పర్వాలేదు.. అన్నీ బాగా ఆడాలి, ఆ డబ్బులన్నీ మన ఇండస్ట్రీకే వస్తాయని అన్నారు. అన్ని సినిమాలకు కలెక్షన్స్ వస్తే.. థియేటర్లు బాగుంటాయి కదా. ప్రతీ రాజకీయ నాయకుడి మీద కేసులుంటాయన్న ఆయన ఇందులో ఎవరికీ డప్పు కొట్టలేదు. నమ్మేలా ఉందా? భజనలా అనిపించిందా? అన్నది ఆడియెన్స్కి అర్థం అవుతుందని అన్నారు. సినిమాలంటే.. నిజాలైనా చూపించాలి.. నమ్మేలా అయినా చూపించాలి. ఇందులో నిజాలెంత?, కల్పితం ఎంత అంటే.. అన్నంలో నీళ్లలా 1:2 శాతం అని చెప్పలేమన్నారు. మమ్ముట్టి చేసిన ఆ మూగమ్మాయి సీన్ నిజమా? అంటే నేను చెప్పలేను కానీ ఆ పాత్ర సోల్, ఎమోషన్ మాత్రం నిజం’ అని అన్నారు.