Vijaya Shanthi: అందుకే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయశాంతి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమాలో విజయశాంతి కుమారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు అశోక్ ఆర్ట్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. కానీ యూనిట్ మాత్రం సూపర్ సక్సెస్ అయినట్లుగానే చెబుతోంది. తాజాగా ఈ నేపథ్యంలో సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయశాంతి మీడియాతో ముచ్చటించింది. అయితే సక్సెస్ మీట్లో ఆమె కొంతమంది కావాలని సినిమాని చంపేస్తున్నారని, అలాంటి వారందరికీ వార్నింగ్ ఇస్తున్నానంటూ ఆమె హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు.
Lady Aghori: పూజల పేరుతో లక్షల్లో మోసం.. లేడీ అఘోరీ అరెస్ట్
Also Read
- Blackmail : వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
- Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
- Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
- Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్'లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ఈ పరిణామాలు నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. నేను ఇదే సినీ పరిశ్రమ నుంచి వచ్చాను. నన్ను సూపర్ స్టార్ని చేసింది ఇదే సినీ పరిశ్రమ. ఆ ఇండస్ట్రీ బాగుండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు నేను జరుగుతున్నవి, చూస్తున్నవి, నేను విన్నవి స్టేజ్ మీద మాట్లాడాను. నేను ఫలానా వారు అని పేరు పెట్టి చెప్పడం లేదు, కానీ మన చుట్టూ ఇది జరుగుతోంది. ఒక ఇండస్ట్రీ చావాలి అని అనుకోకూడదు, బతకాలి. ఎందుకంటే ఇది ఒక మహా వృక్షం లాంటిది. ఇక్కడ మేము బతుకుతున్నాం, సినీ పాత్రికేయులుగా మీరు బతుకుతున్నారు. అన్నీ కొత్తగా ఏమీ రావు. ఉన్నదాంట్లోంచి తీసి వండాల్సి ఉంటుంది.
మనం ఒక కూర నుంచి నాలుగైదు రకాలుగా కోరలు వండొచ్చు, కానీ లక్ష రకాల కూరలు వండలేం కదా. సినిమా కూడా అంతే. ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. ఉన్న వాటిలో మంచిగా చేయాలి అనుకోవాలి. కానీ ఇంకా ఏదో కావాలి అని అంటూ కళ్ళు, ముక్కు, చెవులు పెట్టేసి సినిమాని క్రిటిసైజ్ చేయాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది. మీకు నచ్చకపోతే దర్శకుడు, నిర్మాతకు సజెషన్స్ ఇవ్వవచ్చు. ఇప్పుడు ఎవరైతే సినిమా మీద నెగిటివ్ మాట్లాడుతున్నారో, వాళ్ళ దగ్గర ఏమైనా పాయింట్స్ ఉంటే ఇవ్వవచ్చు. కానీ బాగున్నదాన్ని పబ్లిక్గా వచ్చి బాలేదు అని చంపకండి. అలా చేయడం కరెక్ట్ కాదు. ఆ విషయంలో నాకు బాధ అనిపించింది అందుకే ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చింది అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!