Tollywood: ఒకే నిర్మాణ సంస్థ నుండి రెండు భారీ సినిమాలు..వారం గ్యాప్ లో విడుదల
- రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల
- మారుతీ దర్శకత్వంలో రానున్న రాజాసాబ్
- హారర్ కామెడీ నేపథ్యంలో వస్తోన్న ప్రభాస్
టాలీవుడ్ లోని బిగ్ బ్యానర్స్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల ఈ సంస్థ అధినేతలు. అతి తక్కువ కాలంలో మిడ్ రేంజ్ బ్యానర్ నుండి భారీ చిత్రాలు నిర్మించే ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది పీపుల్స్ మీడియా. కెరీర్ మొదట్లో ఒక రేంజ్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ అనంతి కాలంలోనే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ వంటి సినిమాలు నిర్మించే దిశగా ఎదిగింది.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదలకు రెడీగా ఉంది. ఇటీవల కాలంలో రవితేజ తో వరుసగా మూడు సినిమాలు నిర్మించిన ఏకైక సంస్థ పీపుల్స్ మీడియా. మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే పనిలో ఉన్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ” ది రాజాసాబ్” చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తోంది. హారర్ కామెడీ కథాంశంతో రానున్న ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలయిన ‘రాజాసాబ్’ గ్లిమ్స్ విశేష ఆదరణ పొందింది. కాగా చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న సమ్మర్ కానుకగా పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. మరో వైపు ఇదే నిర్మాణ సంస్థ హనుమాన్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన తేజా సజ్జా హీరోగా ‘మిరాయ్’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 18న విడుదల చేస్తోంది. కేవలం వారం రోజుల గ్యాప్ లో రెండు భారీ చిత్రాలను విడుదల చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.
Also Read
తాజావార్తలు
-
Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
-
Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
-
Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
-
Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!