Trivikram: ఆ స్టార్ హీరోలతో త్రివిక్రమ్ మూడో సినిమా చిత్రం భళారే విచిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram: మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకూ ముగ్గురు టాప్ స్టార్స్ తో మూడేసి సినిమాలు చేశారు. అయితే ఆ స్టార్స్ తో చేసిన మూడో సినిమా రిలీజ్ విషయంలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటో చూద్దాం. రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కేవలం ఆరుగురు హీరోలతోనే వర్క్ చేశారు. అందులో తరుణ్, నితిన్, జూనియర్ ఎన్టీయార్ తో ఒక్కో సినిమా చేసిన త్రివిక్రమ్… మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మాత్రం మూడేసి సినిమాలు తీశారు. విశేషం ఏమంటే ఈ ముగ్గురు స్టార్స్ తోనూ త్రివిక్రమ్ తీసిన మూడో సినిమా సంక్రాంతి కానుకగానే విడుదల కావటం. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తీసిన ‘జల్సా’ 2008 ఏప్రిల్ లో రిలీజ్ కాగా, రెండో సినిమా ‘అత్తారింటికి దారేది’ 2013 సెప్టెంబర్ లో వచ్చింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’ 2018 సంక్రాంతికి విడుదలైంది. బట్ ఈ సినిమా మొదటి రెండు చిత్రాలతో పోల్చితే దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనూ మూడు సినిమాలు చేశారు.
Read also: Viral Video : ఏం ఐడియా రా బాబు.. ఇది బైక్ నా.. ఆటోనా..
Also Read
వీరిద్దరి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘జులాయి’ 2012 ఆగస్ట్ లో విడుదల కాగా రెండో సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ 2015 ఏప్రిల్ నెలలో వచ్చింది. ‘జులాయి’ స్థాయి విజయాన్ని అందుకోక పోయినా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక వీరిద్దరి మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’ 2020 సంక్రాంతి కానుగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతికి వచ్చి పరాజయం పాలైన ‘అజ్ఞాతవాసి’ సెంటిమెంట్ ను ఈ సినిమా చెరిపేసింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడు సినిమాలు చేసిన మరో హీరో ప్రిన్స్ మహేశ్ బాబు. వీరిద్దరి మొదటి సినిమా ‘అతడు’ 2005 ఆగస్ట్ లో విడుదలైంది. కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిన ఈ సినిమా ఆ తర్వాత బుల్లితెరపై బంపర్ హిట్ అయ్యింది. అలానే రెండో సినిమా ‘ఖలేజా’ 2010 అక్టోబర్ లో జనం ముందుకు వచ్చింది. కానీ ‘అతడు’లా ఇది మెప్పించలేకపోయింది. అయితే ‘అతడు’లాగే ఈ సినిమా కూడా బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంది. ఇప్పుడు వీరిద్దరూ ముచ్చటగా మూడో సినిమా ‘గుంటూరు కారం’ చేస్తున్నారు. చిత్రం ఏమంటే పవన్, అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేసిన మూడో సినిమా సంక్రాంతికి వచ్చినట్టుగానే ఇప్పుడు ‘గుంటూరు కారం’ కూడా 2024 సంక్రాంతికి విడుదల కాబోతోంది. మరి ‘అతడు, ఖలేజా’ చిత్రాలను మించిన విజయాన్ని ‘గుంటూరు కారం’తో మహేశ్, త్రివిక్రమ్ అందుకుంటారేమో చూద్దాం.
Madhya Pradesh: 62 ఏళ్ల వ్యక్తికి 30 ఏళ్ల భార్య.. వీరికి ముగ్గురు పిల్లలు
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!