Trivikram: ఆ స్టార్ హీరోలతో త్రివిక్రమ్ మూడో సినిమా చిత్రం భళారే విచిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram: మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకూ ముగ్గురు టాప్ స్టార్స్ తో మూడేసి సినిమాలు చేశారు. అయితే ఆ స్టార్స్ తో చేసిన మూడో సినిమా రిలీజ్ విషయంలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటో చూద్దాం. రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కేవలం ఆరుగురు హీరోలతోనే వర్క్ చేశారు. అందులో తరుణ్, నితిన్, జూనియర్ ఎన్టీయార్ తో ఒక్కో సినిమా చేసిన త్రివిక్రమ్… మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మాత్రం మూడేసి సినిమాలు తీశారు. విశేషం ఏమంటే ఈ ముగ్గురు స్టార్స్ తోనూ త్రివిక్రమ్ తీసిన మూడో సినిమా సంక్రాంతి కానుకగానే విడుదల కావటం. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తీసిన ‘జల్సా’ 2008 ఏప్రిల్ లో రిలీజ్ కాగా, రెండో సినిమా ‘అత్తారింటికి దారేది’ 2013 సెప్టెంబర్ లో వచ్చింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’ 2018 సంక్రాంతికి విడుదలైంది. బట్ ఈ సినిమా మొదటి రెండు చిత్రాలతో పోల్చితే దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనూ మూడు సినిమాలు చేశారు.
Read also: Viral Video : ఏం ఐడియా రా బాబు.. ఇది బైక్ నా.. ఆటోనా..
Also Read
వీరిద్దరి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘జులాయి’ 2012 ఆగస్ట్ లో విడుదల కాగా రెండో సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ 2015 ఏప్రిల్ నెలలో వచ్చింది. ‘జులాయి’ స్థాయి విజయాన్ని అందుకోక పోయినా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక వీరిద్దరి మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’ 2020 సంక్రాంతి కానుగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతికి వచ్చి పరాజయం పాలైన ‘అజ్ఞాతవాసి’ సెంటిమెంట్ ను ఈ సినిమా చెరిపేసింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడు సినిమాలు చేసిన మరో హీరో ప్రిన్స్ మహేశ్ బాబు. వీరిద్దరి మొదటి సినిమా ‘అతడు’ 2005 ఆగస్ట్ లో విడుదలైంది. కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిన ఈ సినిమా ఆ తర్వాత బుల్లితెరపై బంపర్ హిట్ అయ్యింది. అలానే రెండో సినిమా ‘ఖలేజా’ 2010 అక్టోబర్ లో జనం ముందుకు వచ్చింది. కానీ ‘అతడు’లా ఇది మెప్పించలేకపోయింది. అయితే ‘అతడు’లాగే ఈ సినిమా కూడా బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంది. ఇప్పుడు వీరిద్దరూ ముచ్చటగా మూడో సినిమా ‘గుంటూరు కారం’ చేస్తున్నారు. చిత్రం ఏమంటే పవన్, అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేసిన మూడో సినిమా సంక్రాంతికి వచ్చినట్టుగానే ఇప్పుడు ‘గుంటూరు కారం’ కూడా 2024 సంక్రాంతికి విడుదల కాబోతోంది. మరి ‘అతడు, ఖలేజా’ చిత్రాలను మించిన విజయాన్ని ‘గుంటూరు కారం’తో మహేశ్, త్రివిక్రమ్ అందుకుంటారేమో చూద్దాం.
Madhya Pradesh: 62 ఏళ్ల వ్యక్తికి 30 ఏళ్ల భార్య.. వీరికి ముగ్గురు పిల్లలు
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!