Trivikram: ఆ స్టార్ హీరోలతో త్రివిక్రమ్ మూడో సినిమా చిత్రం భళారే విచిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram: మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకూ ముగ్గురు టాప్ స్టార్స్ తో మూడేసి సినిమాలు చేశారు. అయితే ఆ స్టార్స్ తో చేసిన మూడో సినిమా రిలీజ్ విషయంలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటో చూద్దాం. రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కేవలం ఆరుగురు హీరోలతోనే వర్క్ చేశారు. అందులో తరుణ్, నితిన్, జూనియర్ ఎన్టీయార్ తో ఒక్కో సినిమా చేసిన త్రివిక్రమ్… మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మాత్రం మూడేసి సినిమాలు తీశారు. విశేషం ఏమంటే ఈ ముగ్గురు స్టార్స్ తోనూ త్రివిక్రమ్ తీసిన మూడో సినిమా సంక్రాంతి కానుకగానే విడుదల కావటం. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తీసిన ‘జల్సా’ 2008 ఏప్రిల్ లో రిలీజ్ కాగా, రెండో సినిమా ‘అత్తారింటికి దారేది’ 2013 సెప్టెంబర్ లో వచ్చింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’ 2018 సంక్రాంతికి విడుదలైంది. బట్ ఈ సినిమా మొదటి రెండు చిత్రాలతో పోల్చితే దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనూ మూడు సినిమాలు చేశారు.
Read also: Viral Video : ఏం ఐడియా రా బాబు.. ఇది బైక్ నా.. ఆటోనా..
Also Read
- Kajal Aggarwal: "అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్లోకి వచ్చాడు".. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
- Sumanth: 'నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..' అంత మాట అనేశాడేంటి?
- NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
- Janhvi Kapoor: జాన్వీ కపూర్కు ఆ స్టార్తో నిజంగానే గ్యాప్ వచ్చిందా?
వీరిద్దరి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘జులాయి’ 2012 ఆగస్ట్ లో విడుదల కాగా రెండో సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ 2015 ఏప్రిల్ నెలలో వచ్చింది. ‘జులాయి’ స్థాయి విజయాన్ని అందుకోక పోయినా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక వీరిద్దరి మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’ 2020 సంక్రాంతి కానుగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతికి వచ్చి పరాజయం పాలైన ‘అజ్ఞాతవాసి’ సెంటిమెంట్ ను ఈ సినిమా చెరిపేసింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడు సినిమాలు చేసిన మరో హీరో ప్రిన్స్ మహేశ్ బాబు. వీరిద్దరి మొదటి సినిమా ‘అతడు’ 2005 ఆగస్ట్ లో విడుదలైంది. కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిన ఈ సినిమా ఆ తర్వాత బుల్లితెరపై బంపర్ హిట్ అయ్యింది. అలానే రెండో సినిమా ‘ఖలేజా’ 2010 అక్టోబర్ లో జనం ముందుకు వచ్చింది. కానీ ‘అతడు’లా ఇది మెప్పించలేకపోయింది. అయితే ‘అతడు’లాగే ఈ సినిమా కూడా బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంది. ఇప్పుడు వీరిద్దరూ ముచ్చటగా మూడో సినిమా ‘గుంటూరు కారం’ చేస్తున్నారు. చిత్రం ఏమంటే పవన్, అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేసిన మూడో సినిమా సంక్రాంతికి వచ్చినట్టుగానే ఇప్పుడు ‘గుంటూరు కారం’ కూడా 2024 సంక్రాంతికి విడుదల కాబోతోంది. మరి ‘అతడు, ఖలేజా’ చిత్రాలను మించిన విజయాన్ని ‘గుంటూరు కారం’తో మహేశ్, త్రివిక్రమ్ అందుకుంటారేమో చూద్దాం.
Madhya Pradesh: 62 ఏళ్ల వ్యక్తికి 30 ఏళ్ల భార్య.. వీరికి ముగ్గురు పిల్లలు
తాజావార్తలు
-
Metro Express: కరీంనగర్లో ‘సిటీ మెట్రో ఎక్స్ప్రెస్’ బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
-
Sai Krishna Lockup Death Case: సీఐ నాగరాజుపై సుదీర్ఘ విచారణ.. ప్రశ్నల వర్షం కురిపించిన SIT..
-
YS Jagan: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్ష సాధింపు.. ప్రమాదాన్ని కుట్రగా మార్చారు.!
-
IMD Alert: 19 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
-
Drugs: డ్రగ్స్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ..
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!