Trivikram: ఆ స్టార్ హీరోలతో త్రివిక్రమ్ మూడో సినిమా చిత్రం భళారే విచిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram: మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకూ ముగ్గురు టాప్ స్టార్స్ తో మూడేసి సినిమాలు చేశారు. అయితే ఆ స్టార్స్ తో చేసిన మూడో సినిమా రిలీజ్ విషయంలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటో చూద్దాం. రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కేవలం ఆరుగురు హీరోలతోనే వర్క్ చేశారు. అందులో తరుణ్, నితిన్, జూనియర్ ఎన్టీయార్ తో ఒక్కో సినిమా చేసిన త్రివిక్రమ్… మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మాత్రం మూడేసి సినిమాలు తీశారు. విశేషం ఏమంటే ఈ ముగ్గురు స్టార్స్ తోనూ త్రివిక్రమ్ తీసిన మూడో సినిమా సంక్రాంతి కానుకగానే విడుదల కావటం. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తీసిన ‘జల్సా’ 2008 ఏప్రిల్ లో రిలీజ్ కాగా, రెండో సినిమా ‘అత్తారింటికి దారేది’ 2013 సెప్టెంబర్ లో వచ్చింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’ 2018 సంక్రాంతికి విడుదలైంది. బట్ ఈ సినిమా మొదటి రెండు చిత్రాలతో పోల్చితే దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనూ మూడు సినిమాలు చేశారు.
Read also: Viral Video : ఏం ఐడియా రా బాబు.. ఇది బైక్ నా.. ఆటోనా..
Also Read
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
- Nagendra Kasi: ‘రాకా’ నుంచి మైండ్ బ్లాక్ అప్డేట్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ల్యాండ్మార్క్ అంటూ కామెంట్స్!
- Ajith Kumar: తలా అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. దిగ్భ్రాంతిలో ఫ్యాన్స్!
వీరిద్దరి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘జులాయి’ 2012 ఆగస్ట్ లో విడుదల కాగా రెండో సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ 2015 ఏప్రిల్ నెలలో వచ్చింది. ‘జులాయి’ స్థాయి విజయాన్ని అందుకోక పోయినా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక వీరిద్దరి మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’ 2020 సంక్రాంతి కానుగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతికి వచ్చి పరాజయం పాలైన ‘అజ్ఞాతవాసి’ సెంటిమెంట్ ను ఈ సినిమా చెరిపేసింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడు సినిమాలు చేసిన మరో హీరో ప్రిన్స్ మహేశ్ బాబు. వీరిద్దరి మొదటి సినిమా ‘అతడు’ 2005 ఆగస్ట్ లో విడుదలైంది. కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిన ఈ సినిమా ఆ తర్వాత బుల్లితెరపై బంపర్ హిట్ అయ్యింది. అలానే రెండో సినిమా ‘ఖలేజా’ 2010 అక్టోబర్ లో జనం ముందుకు వచ్చింది. కానీ ‘అతడు’లా ఇది మెప్పించలేకపోయింది. అయితే ‘అతడు’లాగే ఈ సినిమా కూడా బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంది. ఇప్పుడు వీరిద్దరూ ముచ్చటగా మూడో సినిమా ‘గుంటూరు కారం’ చేస్తున్నారు. చిత్రం ఏమంటే పవన్, అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేసిన మూడో సినిమా సంక్రాంతికి వచ్చినట్టుగానే ఇప్పుడు ‘గుంటూరు కారం’ కూడా 2024 సంక్రాంతికి విడుదల కాబోతోంది. మరి ‘అతడు, ఖలేజా’ చిత్రాలను మించిన విజయాన్ని ‘గుంటూరు కారం’తో మహేశ్, త్రివిక్రమ్ అందుకుంటారేమో చూద్దాం.
Madhya Pradesh: 62 ఏళ్ల వ్యక్తికి 30 ఏళ్ల భార్య.. వీరికి ముగ్గురు పిల్లలు
తాజావార్తలు
-
Abhishek Banerjee: “నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు”.. చిక్కుల్లో మమత మేనల్లుడు
-
Vinesh Phogat: వినేష్ ఫోగట్కు బిగ్ షాక్.. ఆసియా క్రీడల నుంచి ఔట్
-
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..