Trivikram: టాలీవుడ్ షేకయ్యే కాంబో సెట్ చేసిన త్రివిక్రమ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసిన తర్వాత, త్రివిక్రమ్ అల్లు అర్జున్తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ, అల్లు అర్జున్కు చెప్పిన కథ పూర్తిస్థాయిలో ఒప్పించలేకపోవడంతో, ఆయన అట్లీ సినిమా చేసేందుకు వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు వెంకటేష్తో త్రివిక్రమ్ ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జూలై నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే, త్రివిక్రమ్ ఈ సినిమా కోసం రామ్ చరణ్ను రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.
Also Read:Tollywood: 300 + సినిమాలు ఫర్ సేల్
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
దీనికి సంబంధించి వచ్చే వారం త్రివిక్రమ్, రామ్ చరణ్ల మీటింగ్ కూడా జరగబోతోంది. నిజానికి, త్రివిక్రమ్, రామ్ చరణ్ ఎప్పటినుంచో కలిసి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు, కానీ ఎన్నో కారణాల వల్ల ఇప్పటివరకు అది వర్కౌట్ కాలేదు. ఒకవేళ త్రివిక్రమ్ చెప్పిన కథ రామ్ చరణ్కు నచ్చి, ఆయన ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇది ఒక షాకింగ్ కాంబో అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజస్ రగ్గడ్ లుక్లో ఉంటూ పెద్ది సినిమా కోసం షూట్ చేస్తున్నాడు.
Also Read:Anirudh: అనిరుథ్కి పెట్టిన డబ్బులొచ్చేశాయ్.. కానీ?
ఒకవేళ త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చితే, రామ్ చరణ్ ఆ పెద్ద సినిమా డేట్స్ నుంచే డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ సినిమాకు ఇవ్వాల్సి ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని అంటున్నారు. మరోపక్క, చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కూడా సంక్రాంతి రేసులోనే ఉంది. కాబట్టి, రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్లో భాగం అయితే, సినిమా కాస్త వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. హారిక హాసిని సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!