Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ.. పర్సంటేజ్ గొడవకు ముగింపు పలికినట్లేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న ‘సింగిల్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం’ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. రాజమండ్రి పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు మంగళవారం అత్యవసరంగా కలుసుకున్నారు. స్థానిక షెల్టన్ హోటల్లో ఈ కీలక సమావేశం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు పలువురు అగ్ర నిర్మాతలు రాజమండ్రి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ను కలిసిన వారిలో సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ, మైత్రీ మూవీ మేకర్స్ వై.రవిశంకర్, ప్రముఖ నిర్మాత కిలారి సతీష్తో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు.
భేటీ వెనుక అసలు కారణం ఇదే..
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు, డిస్ట్రిబ్యూటర్లు – నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ షేరింగ్ విషయంలో తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ ఇష్యూ కారణంగా ఇండస్ట్రీలో తలెత్తిన తాజా పరిస్థితులను, ఎదురవుతున్న ఇబ్బందులను నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కూలంకషంగా వివరించారు. థియేటర్ల వ్యవస్థను కాపాడుకుంటూనే, అటు నిర్మాతలకు నష్టం రాకుండా ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలంటూ నిర్మాతలు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా ఈ వివాదంలో జోక్యం చేసుకుని సమస్య సద్దుమణిగేలా చూడాలని వారు డిప్యూటీ సీఎంను కోరారని టాక్. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ సింగిల్ థియేటర్ల వివాదంపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
- S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- S Janaki: "ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు.." ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
- S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!