Tollywood: గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు.. ఛైర్మెన్ ఎవరంటే.?
- గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీ
- లోగో - విధివిధానాలు - నిబంధనల కోసం కమిటీ
- ఉత్తర్వులు జారీ చేసిన రేవంత్ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సినీనటుల ఉత్తమ ప్రదర్శనకు గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డులను అంజేసేవారు. అప్పటి ప్రభుత్వాలు ఈ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేవారు కూడా. కానీ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ కాయక్రమాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. 2014లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి నంది అవార్డులను ప్రకటించింది, విజేతలకు అవార్డులు అందజేశారు తప్ప వేడుక నిర్వహించలేదు. కానీ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వాలని నిశ్చయించింది.
Also Raed: Kiran Abbavaram: మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన రాజావారు రాణిగారు.
Also Read
- Yellamma First Look: సంగీత దర్శకుడు కాదు.. ఇప్పుడు హీరో డీఎస్పీ!.. అదిరిపోయిన 'ఎల్లమ్మ' ఫస్ట్ లుక్
- King100: నాగ్ 100వ సినిమాకు డీఎస్పీ ఎంట్రీ.. అంచనాలు పెంచిన క్రేజీ కాంబో
- Spider Man: భారత్లో 'స్పైడర్ మ్యాన్' సునామీ... రూ. 500 కోట్ల క్లబ్పై మార్వెల్ కన్ను
- Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్లో జరిగిన ఘటన ఏంటి?
ఈ ఏడాది గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్, నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది గద్దర్ జయంతి రోజున ఆ పురస్కారాలు ఇస్తామని తెలిపారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఈ గురువారం గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు కొందరు సినీ ప్రముఖులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి ప్రముఖ దర్శకులు బి.నర్సింగరావు ఛైర్మన్గా వ్యవహరించనుండగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజును వైస్ ఛైర్మన్గా ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఈ కమిటీకి సలహాదారులుగా దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి సురేశ్ బాబు, చంద్రబోస్, ఆర్.నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణులతోపాటు ఎఫ్డీసీ ఎండీ మెంబర్ కన్వీనర్గా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్డీసీ ఈ కమిటీతో చర్చించి తదుపరి కార్యాచరణ మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది
తాజావార్తలు
-
Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన ‘షాపింగ్’ కింగ్..
-
AI Effect : AI దెబ్బకు ఉద్యోగాలే మాయం.. చైనాలో మొదలైన ఉపాధి సంక్షోభం.!
-
Elon Musk : నెలలోనే రూ.57 లక్షల కోట్ల ఆవిరి.. ఎలాన్ మస్క్కు భారీ దెబ్బ.!
-
Yuvraj Singh: యువరాజ్ ‘యువి’ పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
-
Yellamma First Look: సంగీత దర్శకుడు కాదు.. ఇప్పుడు హీరో డీఎస్పీ!.. అదిరిపోయిన ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?