Pushpa 2: డిశ్చార్జ్ కానున్న సంధ్య థియేటర్ ఘటన బాధితుడు శ్రీ తేజ్
- మరి కాసేపట్లో కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న సంధ్యా థియేటర్ ఘటన బాధితుడు శ్రీ తేజ
- ఇప్పటికీ పైపు ద్వారా ఆహారాన్ని అందిస్తున్న డాక్టర్లు
- కళ్ళు తెరిచి చూస్తున్నప్పటికీ ఇంకా కుటుంబ సభ్యుల్ని గుర్తుపట్టలేకపోతున్న శ్రీ తేజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది డిసెంబర్ 4, 2024న హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటన తెలుగు సినిమా ప్రపంచంలో విషాదాన్ని నింపింది. అల్లు అర్జున్ నటించిన పుష్పా 2: ది రూల్ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీ తేజ (9) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తర్వాత గత ఐదు నెలలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ ఇప్పుడు డిశ్చార్జ్ కానున్నాడు. అయితే, అతడి ఆరోగ్య పరిస్థితి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రిహాబిలిటేషన్ కోసం రోబోటిక్ ఫిజియోథెరపీ చికిత్సకు పంపనున్నారు.
Read More: Chiranjeevi : ఎన్టీఆర్-నీల్ మూవీ వాయిదా.. చిరంజీవికి తిరుగేలేదు..
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
2024 డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో పుష్పా 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ను చూసేందుకు వేలాది మంది అభిమానులు గుమిగూడారు. అల్లు అర్జున్ తన కారు సన్రూఫ్ నుంచి అభిమానులకు అభివాదం చేయడంతో పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో రేవతి తన కుమారుడు శ్రీ తేజను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయింది. శ్రీ తేజ ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి, తీవ్రమైన మెదడు గాయాలతో కిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. శ్రీ తేజ మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో అతడి అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అతడు వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందాడు. గత ఐదు నెలలుగా కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU)లో ఉన్న శ్రీ తేజకు డాక్టర్లు నిరంతరం చికిత్స అందించారు.
Read More: Lavanya Thripati: ముందు దేశంలోపల శుభ్రం చేయాల్సిన సమయం వచ్చింది
ప్రస్తుతం శ్రీ తేజ వెంటిలేటర్ లేకుండా స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు, కానీ ఇంకా పైపు ద్వారా ఆహారం అందుకుంటున్నాడు. అతడు కళ్లు తెరిచి చూస్తున్నప్పటికీ, కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేకపోతున్నాడు. నాడీ వ్యవస్థలో ఇంకా స్థిరత్వం రాలేదు. డాక్టర్లు ఫిజియోథెరపీ చేస్తున్నప్పటికీ ఆరోగ్యంలో కొంత మెరుగుదల కనిపించడంతో, అతడిని ఇప్పుడు రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రోబోటిక్ ఫిజియోథెరపీ చికిత్సను అందించనున్నారు. ఈ అధునాతన చికిత్స అతడి కదలికలను, సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని వైద్యులు ఆశిస్తున్నారు. ఈ ప్రక్రియ దీర్ఘకాలికం కావచ్చని, కానీ శ్రీ తేజ పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!