Pushpa 2: డిశ్చార్జ్ కానున్న సంధ్య థియేటర్ ఘటన బాధితుడు శ్రీ తేజ్
- మరి కాసేపట్లో కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న సంధ్యా థియేటర్ ఘటన బాధితుడు శ్రీ తేజ
- ఇప్పటికీ పైపు ద్వారా ఆహారాన్ని అందిస్తున్న డాక్టర్లు
- కళ్ళు తెరిచి చూస్తున్నప్పటికీ ఇంకా కుటుంబ సభ్యుల్ని గుర్తుపట్టలేకపోతున్న శ్రీ తేజ
గత ఏడాది డిసెంబర్ 4, 2024న హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటన తెలుగు సినిమా ప్రపంచంలో విషాదాన్ని నింపింది. అల్లు అర్జున్ నటించిన పుష్పా 2: ది రూల్ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీ తేజ (9) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తర్వాత గత ఐదు నెలలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ ఇప్పుడు డిశ్చార్జ్ కానున్నాడు. అయితే, అతడి ఆరోగ్య పరిస్థితి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రిహాబిలిటేషన్ కోసం రోబోటిక్ ఫిజియోథెరపీ చికిత్సకు పంపనున్నారు.
Read More: Chiranjeevi : ఎన్టీఆర్-నీల్ మూవీ వాయిదా.. చిరంజీవికి తిరుగేలేదు..
Also Read
- Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
2024 డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో పుష్పా 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ను చూసేందుకు వేలాది మంది అభిమానులు గుమిగూడారు. అల్లు అర్జున్ తన కారు సన్రూఫ్ నుంచి అభిమానులకు అభివాదం చేయడంతో పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో రేవతి తన కుమారుడు శ్రీ తేజను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయింది. శ్రీ తేజ ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి, తీవ్రమైన మెదడు గాయాలతో కిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. శ్రీ తేజ మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో అతడి అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అతడు వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందాడు. గత ఐదు నెలలుగా కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU)లో ఉన్న శ్రీ తేజకు డాక్టర్లు నిరంతరం చికిత్స అందించారు.
Read More: Lavanya Thripati: ముందు దేశంలోపల శుభ్రం చేయాల్సిన సమయం వచ్చింది
ప్రస్తుతం శ్రీ తేజ వెంటిలేటర్ లేకుండా స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు, కానీ ఇంకా పైపు ద్వారా ఆహారం అందుకుంటున్నాడు. అతడు కళ్లు తెరిచి చూస్తున్నప్పటికీ, కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేకపోతున్నాడు. నాడీ వ్యవస్థలో ఇంకా స్థిరత్వం రాలేదు. డాక్టర్లు ఫిజియోథెరపీ చేస్తున్నప్పటికీ ఆరోగ్యంలో కొంత మెరుగుదల కనిపించడంతో, అతడిని ఇప్పుడు రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రోబోటిక్ ఫిజియోథెరపీ చికిత్సను అందించనున్నారు. ఈ అధునాతన చికిత్స అతడి కదలికలను, సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని వైద్యులు ఆశిస్తున్నారు. ఈ ప్రక్రియ దీర్ఘకాలికం కావచ్చని, కానీ శ్రీ తేజ పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!