Prabhas: ఆ సీన్ చూసి ఏడ్చేశా.. షూటింగ్ గ్యాప్లో ప్రభాస్ ఎమోషనల్! అసలు ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన సరికొత్త మ్యూజికల్ ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’. ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో ‘కల్కి 2898 ఏడీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్, రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య జరిగిన సంభాషణలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
షూటింగ్ గ్యాప్లో ప్రభాస్ ‘సింగ్ గీతం’ సినిమాను చూశారు. ఈ సినిమా చూసిన అనంతరం డార్లింగ్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్కి కాల్ చేసి పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఎమోషనల్ అవుతూ.. “సింగీతం గారు జీనియస్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమా ఇది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో హీరో చెట్టు దగ్గరికి వెళ్లే ఒక ఎమోషనల్ సీన్ చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. గతంలో సింగీతం గారు ‘మయూరి’ సినిమాలో నిజంగానే కాలు లేని అమ్మాయిని పెట్టి భరతనాట్యం చేయించి ఎలాగైతే ఎమోషన్ పండించారో.. ఇందులోనూ పాటల ద్వారానే ఏడిపించేశారు” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. వెంటనే సింగీతం గారికి ఒక వాయిస్ మెసేజ్ పెడుతూ.. “సార్, ఇప్పుడే సినిమా చూశాను. యు ఆర్ ద గ్రేటెస్ట్ ఎవర్ సార్.. హాట్సాఫ్” అని తన గౌరవాన్ని చాటుకున్నారు.
Also Read
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
- Varanasi Movie Update: 'వారణాసి'కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
- Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. 'బెత్లేహెమ్ కుటుంబ యూనిట్' బ్లాక్ బస్టర్
- Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ఈ సినిమా అంతా మాటలు లేకుండా కేవలం పాటలతోనే సాగడంపై ప్రభాస్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అసలు సింగీతం గారు ఎలా ఆలోచిస్తారు అని నాగ్ అశ్విన్ను అడిగారు. దానికి నాగ్ అశ్విన్ సమాధానమిస్తూ.. “సాధారణంగా ట్యూన్ వచ్చాక లిరిక్స్ రాస్తారు. కానీ సింగీతం గారు మొదట డైలాగ్స్ తరహాలో లిరిక్స్ రాసి, ఆ తర్వాత ట్యూన్ చేశారు. ఆయనే స్వయంగా ఒకటిన్నర గంటల పాటు ప్రతి సీన్ను పాడుతూ మాకు నర్రేషన్ పంపించారు. మొదట్లో మాకు ఇది అర్థం కాలేదు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆ సీన్లను ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేసి అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. సింగీతం గారితో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాకు అంతే ముఖ్యం” అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!