Nara Lokesh Congratulates Kalki 2898 AD Team: ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ సినిమాకి సంబంధించి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండగా తాజాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కల్కి సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. కల్కి సినిమా గురించి అద్భుతమైన రివ్యూస్ వినడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే అందరికీ కంగ్రాట్యులేషన్స్.
Kalki 2898 AD: 600 కోట్ల సినిమా డైరెక్టర్ చెప్పులేంట్రా ఇలా ఉన్నాయి?
అలాగే ఈ సినిమాని ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసే సినిమాగా ఒక మాస్టర్ పీస్ గా తెరకెక్కించినందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి కూడా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు అశ్విని దత్ కి స్పెషల్ అప్రిషియేషన్ దక్కాలని పేర్కొన్న ఆయన స్వప్న, ప్రియాంక తెలుగు సినిమాకి సంబంధించిన కట్టుబాట్లను చెరిపేసి తెలుగు సినిమాని గ్లోబల్ లీగ్ లోకి తీసుకు వెళ్ళేందుకు చాలా కృషి చేశారని ఈ సందర్భంగా నారా లోకేష్ కామెంట్ చేశారు. అశ్వినీ దత్ ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుడుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సమయంలో కూడా ఆయన జైలుకు వెళ్లి పరామర్శించి తెలుగుదేశానికి అండగానే ఉంటామంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆయన నిర్మించిన సినిమాకి హిట్ టాక్ రావడంతో నారా లోకేష్ అభినందిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.
Really happy to hear terrific reviews for #Kalki2898AD. I congratulate #Prabhas Garu, @SrBachchan Garu, @ikamalhaasan Garu, @deepikapadukone Garu and Director @nagashwin7 Garu for redefining Indian Cinema with this masterpiece. Special praise must be reserved for @AshwiniDuttCh… pic.twitter.com/O3E92GcPIZ
— Lokesh Nara (@naralokesh) June 27, 2024