గోపీచంద్ తో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ప్రొడక్షన్ హౌస్, గోపిచంద్ తో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. దీనికి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. తాత్కాలికంగా “గోపిచంద్ 30” పేరుతో ఉన్న ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం గోపిచంద్ సరసన ‘ఇస్మార్ట్’ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఈ చిత్రంలో నభా నటేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆమె పేరే ఇప్పుడు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Read Also : వెంకీ కుడుముల కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్!
Also Read
శ్రీవాస్తో కలిసి గోపీచంద్ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. మేకర్స్ ప్రస్తుతం మిగిలిన తారాగణం మరియు సిబ్బందిని ఖరారు చేస్తున్నారు. భూపతి రాజా కథ రాశారు. గతంలో గోపీచంద్, శ్రీవాస్ ఇద్దరూ ‘లక్ష్యం’, ‘లౌక్యం’లతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు సినిమాలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరోవైపు నభా నటేష్ తాను హీరోయిన్ గా నటించిన “మాస్ట్రో” విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఇందులో ఆమె యువ నటుడు నితిన్ తో రొమాన్స్ చేస్తోంది. ఇది హిందీ థ్రిల్లర్ డ్రామా “అంధాదున్” రీమేక్. వీరితో పాటు ‘మాస్ట్రో’లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా కీలకపాత్రలో నటిస్తోంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..