Alai balai: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్ బలయ్.. ఒకే వేదికపై మెగాస్టార్, పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi- Alai balai: నిన్న మెగాస్టార్ చిరంజీవితో హర్యారా గవర్నర్ బండారు దత్తాత్రేయ భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ఫాదర్ సినిమాపై దత్తాత్రేయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ఫాదర్ హిట్ కావడం సంతోషంగా ఉందన్నారు. నటుడిగా గొప్ప విలువలు వున్న వ్యక్తి చిరంజీవి అని గవర్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు జరిగే అలయ్ బలయ్ కార్యక్రామానికి మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బండారు దత్తాత్రేయ ప్రత్యేకంగా ఆహ్వానించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దాదాపు 17 ఏళ్ల నుంచి నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ఈవేడుకకు మెగాస్టార్ చిరంజీవి, జననేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు సమాచారం. దీంతో మెగా, పవన్ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో భారీగా మోగా అభిమానులు నాంపల్లి ఎగ్జిబిషన్ ను చేరుకున్నారు. పది గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సందడి వాతావరణం కనిపించింది. దీంతో పోలీసులు అధికారులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
Read also: Kerala: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులతో సహా 9 మంది మృతి
ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం హాజరుకానున్నట్లు సమాచారం. ఇక.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, జి. కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా, హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, భగవత్ మాన్ సింగ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మెహమూద్ అలీ, మంత్రి శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు విశ్వనీయ సమాచారం.
అయితే.. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. కాగా.. ఈసారి మాత్రం దీనికి కాస్త రాజకీయ ప్రాధాన్యత ఏర్పడినట్టే కనిపిస్తోంది. ఇక… వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతోండటం.. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం వంటి పరిస్థితుల మధ్య అలయ్ బలయ్ ఏర్పాటు కాబోతోండటం వల్ల అందరి దృష్టీ దాని మీదే ఉంది. ఇక.. హర్యారా గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా చిరంజీవి కలిసి ప్రత్యేకంగా ఈకార్యాక్రమానికి ఆహ్వానించడంపై రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
Jio True 5G: 5జీలోనూ జియో సంచలనం.. అన్నీ ఫ్రీ… వారికి మాత్రమే..
తాజావార్తలు
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!