Jio True 5G: 5జీలోనూ జియో సంచలనం.. అన్నీ ఫ్రీ… వారికి మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, ఒక్కొక్కటిగా తమ 5జీ సర్వీలను ప్రారంభిస్తున్నాయి టెలికం సంస్థలు.. భారత్ టెలికం మార్కెట్లో తక్కువ సమయంలోనూ కోట్లాది మంది అభిమాన్ని చురగొని అతిపెద్ద టెలికం సంస్థగా అవిర్భవించిన రిలయన్స్ జియో.. ఇప్పుడు.. 5జీలోనూ దూకుడు చూపిస్తోంది.. విజయదశమిని పురస్కరించుకుని 5జీ సర్వీస్లను మొదలుపెట్టింది జియో.. అయితే, ప్రస్తుతానికి దేశంలోని నాలుగు సిటీల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. అంతేకాదు.. వెల్కమ్ ఆఫర్ను కూడా తీసుకొచ్చింది జియో.. అన్నీ ఉచితమంటూ టెలికం మార్కెట్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన ఆ సంస్థ.. అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ తో ఒక సరికొత్త రికార్డులను సృష్టించింది.. ఇప్పుడు 5జీ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతోంది జియో… ప్రస్తుతానికి నాలుగు సిటీల్లో 5జీ బీటా నెట్వర్క్ను జియో లాంచ్ చేసింది.
Read Also: Astrology : అక్టోబర్ 06, గురువారం దినఫలాలు
Also Read
- RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
- UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
ప్రస్తుతం 5జీ బీటా సర్వీస్లు ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసిలో అందుబాటులోకి తీసుకొచ్చింది జియో.. విజయానికి ప్రతీకగా భావించే విజయదశమి రోజున 5జీ సర్వీస్లను ప్రారంభించింది.. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 5జీ సేవలు పొందాలంటే.. 5జీకి అప్గ్రేడ్ అయ్యేందుకు జియో యూజర్లు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది.. అంటే.. ఇప్పటికే వాడుతోన్న జియో సిమ్.. 5జీకి కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట.. కానీ.. 5జీకి సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ మాత్రం ఉండాలని చెబుతున్నారు. ఆ నాలుగు సిటీల్లో ఎంపిక చేసిన కస్టమర్లకు వెల్కమ్ ఆఫర్ను ఇస్తోంది జియో… కస్టమర్లకు మెసేజ్ ద్వారా ఆహ్వానం పంపి ఈ ఆఫర్ను అందిస్తోంది.. అలా వారు మాత్రమే ఉచితంగా అన్లిమిటెడ్ డేటాను వాడుకునే వీలు ఉంటుంది..
అయితే, రిలయన్స్ జియో 5జీ ప్లాన్లను ప్రకటించే వరకు ఈ వెల్కమ్ ప్లాన్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చెబుతున్నారు విశ్లేషకులు.. కంగా 1జీబీపీఎస్ వరకు వేగం ఉంటుందని జియో చెబుతోంది.. దేశంలోని 8 నగరాల్లో 5జీ సర్వీస్లను తొలి దశలో తీసుకొస్తున్నట్టు ఇప్పటికే ఎయిర్టెల్ ప్రకటించగా.. ఇప్పుడు జియో నాలుగు నగరాల్లో 5జీ సర్వీసులను ప్రారంభించింది.. “జియో యొక్క ట్రూ-5G “వి కేర్” సూత్రంపై నిర్మించబడింది.. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, చిన్న, మధ్యతరహా మరియు పెద్ద సంస్థలు, స్మార్ట్ హోమ్లు, గేమింగ్లో 1.4 బిలియన్ల భారతీయులను ప్రభావితం చేసే పరివర్తన మార్పులను తీసుకువస్తుంది అని ఆ కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.. ఇతర నగరాలు 5జీ టెక్నాలజీకి సిద్ధమవుతున్నందున బీటా ట్రయల్ సేవను ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది. ప్రతి కస్టమర్కు ఉత్తమ కవరేజీ మరియు వినియోగదారు అనుభవాన్ని అందించడానికి ఒక నగరం యొక్క నెట్వర్క్ కవరేజ్ పూర్తయ్యే వరకు ఆహ్వానించబడిన వినియోగదారులు బీటా ట్రయల్ సేవలను పొందడం కొనసాగిస్తారు.
తాజావార్తలు
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!