Kerala: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులతో సహా 9 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deadly road accident in Kerala – 9 people killed: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాలక్కాడ్ జిల్లా ఇక్కడి వడక్కెంచేరిలో పర్యాటకుల బస్సు, కేరళ ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఎర్నాకులంలోని ముళంతురుతిలోని బేసిలియస్ స్కూల్ నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు, కేరళ ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఓ కారును ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు ప్రమాదానికి గురై వాగులో బోల్తా పడింది. వలయార్ వడక్కంచేరి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం విద్యార్థులతో సహా 9 మంది మరణించారు. 12 మందికి తీవ్రగాయాలు కాగా.. 28 మందికి స్వల్పగాయాలయ్యాయి. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో టూరిస్టు బస్సులో 41 మంది విద్యార్థులు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. కేరళ ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Also Read
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
- Ayodhya: "వాష్రూమ్లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
Read Also: Anti Hijab Protest In Iran: హిజాబ్ తీసేసి నిరసనల్లో పాల్గొన్న స్కూల్ విద్యార్థినులు..
మరణించిన వారిలో కేరళ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు, టూరిస్టు బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ఉన్నారు. త్రిసూర్ కు చెందిన రోహిత్ రాజ్(24), కొల్లాంకు చెందిన అనూప్(22), పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు నాన్సీ జార్జ్, వీకే విష్ణు ఉన్నారు. క్షతగాత్రులను పాలక్కాడ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి మృతదేహాలను అలత్తూర్, పాలక్కాడ్ ఆస్పత్రులకు తరలించారు. 16 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఎర్నాకులంలోని మూలంతురుతిలోని బేసిలియస్ స్కూల్ 10,11,12 తరగతుల విద్యార్థులు టూరిస్టు బస్సులో విహారయాత్రకు వెళ్లారు. ఊటీకి వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా ప్రమాద తీవ్రత పెరిగింది. టూరిస్టు బస్సు ఓవర్ స్పీడ్ తో కొట్టారక్కరా నుంచి కోయంబత్తూర్ వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంతో ప్రమాద తీవ్రత తగ్గింది. టూరిస్ట్ బస్సు డ్రైవర్ హెవీ డ్రైవింగ్ వల్ల అలసిపోయి ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన తర్వాత రెవెన్యూ మంత్రి, పాలక్కాడ్ కలెక్టర్లు సహాయ చర్యలను సమన్వయం చేస్తున్నారు.
Kerala | 9 dead, 38 injured after a tourist bus crashed into KSRTC bus in Vadakkenchery in Palakkad district. The tourist bus was carrying students & teachers of Baselios Vidyanikethan in Ernakulam dist & was going to Ooty https://t.co/xIqHhROqff pic.twitter.com/XimJTDTPhA
— ANI (@ANI) October 6, 2022
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..