Kerala: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులతో సహా 9 మంది మృతి
Deadly road accident in Kerala – 9 people killed: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాలక్కాడ్ జిల్లా ఇక్కడి వడక్కెంచేరిలో పర్యాటకుల బస్సు, కేరళ ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఎర్నాకులంలోని ముళంతురుతిలోని బేసిలియస్ స్కూల్ నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు, కేరళ ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఓ కారును ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు ప్రమాదానికి గురై వాగులో బోల్తా పడింది. వలయార్ వడక్కంచేరి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం విద్యార్థులతో సహా 9 మంది మరణించారు. 12 మందికి తీవ్రగాయాలు కాగా.. 28 మందికి స్వల్పగాయాలయ్యాయి. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో టూరిస్టు బస్సులో 41 మంది విద్యార్థులు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. కేరళ ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Also Read
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Read Also: Anti Hijab Protest In Iran: హిజాబ్ తీసేసి నిరసనల్లో పాల్గొన్న స్కూల్ విద్యార్థినులు..
మరణించిన వారిలో కేరళ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు, టూరిస్టు బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ఉన్నారు. త్రిసూర్ కు చెందిన రోహిత్ రాజ్(24), కొల్లాంకు చెందిన అనూప్(22), పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు నాన్సీ జార్జ్, వీకే విష్ణు ఉన్నారు. క్షతగాత్రులను పాలక్కాడ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి మృతదేహాలను అలత్తూర్, పాలక్కాడ్ ఆస్పత్రులకు తరలించారు. 16 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఎర్నాకులంలోని మూలంతురుతిలోని బేసిలియస్ స్కూల్ 10,11,12 తరగతుల విద్యార్థులు టూరిస్టు బస్సులో విహారయాత్రకు వెళ్లారు. ఊటీకి వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా ప్రమాద తీవ్రత పెరిగింది. టూరిస్టు బస్సు ఓవర్ స్పీడ్ తో కొట్టారక్కరా నుంచి కోయంబత్తూర్ వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంతో ప్రమాద తీవ్రత తగ్గింది. టూరిస్ట్ బస్సు డ్రైవర్ హెవీ డ్రైవింగ్ వల్ల అలసిపోయి ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన తర్వాత రెవెన్యూ మంత్రి, పాలక్కాడ్ కలెక్టర్లు సహాయ చర్యలను సమన్వయం చేస్తున్నారు.
Kerala | 9 dead, 38 injured after a tourist bus crashed into KSRTC bus in Vadakkenchery in Palakkad district. The tourist bus was carrying students & teachers of Baselios Vidyanikethan in Ernakulam dist & was going to Ooty https://t.co/xIqHhROqff pic.twitter.com/XimJTDTPhA
— ANI (@ANI) October 6, 2022
తాజావార్తలు
-
Virat Kohli: అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. కింగ్ ఆగ్రహం సరైందేనా?, నిబంధనలు ఏమంటున్నాయి?
-
West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
-
TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
-
Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
-
LPG Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 993 పెంపు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!