మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ ల్లో మంచి ఎంటర్టైనింగ్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. చిరు కెరీర్ లో157వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే మంచి హైప్ ఉంది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ద్వారా ఈ ఏడాది అనిల్ ఊహించని విధంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారనే టాక్ తో మరింత క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా హీరోయిన్ పాత్ర కోసం ఆ స్టార్ నటిని సంప్రదించారని వార్త వైరల్ అవుతుంది.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్న్ను తీసుకోవాలని మూవీ టీం అనుకుంటున్నట్లుగా రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ అది నిజం కాదని తేలిపోయింది. కాగా ఇప్పుడు చిరంజీవి పక్కన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా అయితే బాగుంటారని అనిల్ భావించారట. దీంతో ఆమెను మేకర్స్ సంప్రదించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. కానీ ఈ చిత్రంలో నటించేందుకు నయనతార ఏకంగా రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఒక్క సారిగా మెగాస్టార్తో మూవీ అని కూడా ఆలోచించకుండా, నయనతార అడిగిన రెమ్యూనరేషన్ విని మేకర్స్ అవాక్కయ్యారట. ప్రజంట్ దీనిపై చర్చలు జరిగే అవకాశం ఉందట. ఎందుకైనా మంచిది అని మరో హీరోయిన్ కోసం కూడా వెతుకులాట మొదలు పెట్టారట. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.