Kareena Kapoor: హాలీవుడ్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025లో ప్యానెల్ చర్చలో పాల్గొనడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను షేర్ చేస్తూ, ఈ అవకాశం కేవలం గౌరవం మాత్రమే కాదు, ప్రముఖ వ్యక్తులతో వేదికను పంచుకోవడం స్ఫూర్తిదాయకమైన అనుభవమని తెలిపారు.’బెబో’గా పిలుచుకునే కరీనా, తన తాజా ఫోటోషూట్ను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఈ ఫోటోలలో ఆమె నీలం రంగు ప్రింటెడ్ షిఫాన్ చీరలో అద్భుతంగా కనిపించింది. వేవ్స్ సమ్మిట్ 2025 కోసం ఆమె ఈ స్టైలిష్ లుక్ను ఎంచుకుంది. తన క్యాప్షన్లో ఈ శిఖరాగ్ర సమావేశం గురించి ప్రత్యేక విషయాలను పేర్కొంది.
Read More:Prabhas: ఆ సినిమానే టాప్ ప్రయారిటీ అంటున్న ప్రభాస్!
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
“వేవ్స్ సమ్మిట్లో ప్యానెల్ చర్చలో పాల్గొనడం నాకు గర్వకారణం. భారతదేశం ఇప్పుడు ప్రపంచ వినోద సంభాషణలో భాగం మాత్రమే కాదు, దానిని ముందుకు నడిపిస్తోంది. భారతదేశం వేగంగా ప్రపంచ వినోద పరిశ్రమలో సూపర్ పవర్గా ఎదుగుతోంది. ఇది సృజనాత్మక యుగానికి కేవలం ప్రారంభం మాత్రమే, ఇది భవిష్యత్తును రూపొందిస్తుంది,” అని ఆమె క్యాప్షన్లో రాసింది. గురువారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మొదటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
Read More:
ఈ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, హేమ మాలిని, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, వాణి కపూర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఎస్ఎస్ రాజమౌళి, చిరంజీవి, అనిల్ కపూర్, ఆలియా భట్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ మే 1 నుండి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతోంది. మీడియా మరియు వినోద రంగ సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యం.
వేవ్స్ సమ్మిట్లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ హాలీవుడ్ గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది . ఆమె మాట్లాడుతూ గుర్తింపు కావాలంటే హాలీవుడ్ లోనే నటించాల్సిన అవసరం లేదని పేర్కొంది. చాలా సంవత్సరాల క్రితం విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, 3 ఇడియట్స్ నటి ఒక రెస్టారెంట్లో ఉండగా స్పీల్బర్గ్ ఆమెను గుర్తించి సంభాషించారని గుర్తు చేసుకుంది. “నేను ఒక రెస్టారెంట్లో ఉన్నాను, అదే సమయంలో 3 ఇడియట్స్ విడుదలైంది. స్పీల్బర్గ్ అక్కడే ఉన్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి, ‘నీవు 3 ఇడియట్స్ సినిమాలో నటించిన అమ్మాయివా?’ అని అడిగారు. నేను, ‘అవును, నేనే!’ అని చెప్పాను. అప్పుడు ఆయన, ‘అరె, ఆ సినిమా నాకు చాలా నచ్చింది!’ అని అన్నారు. ఆయన ఆ సినిమాను ఇంగ్లీష్లో చూశారట. ఆ క్షణం మాకు ఎంతో గర్వకారణంగా అనిపించింది,” అని కరీనా ఆనందంగా తెలిపింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!