Irumudi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘ఇరుముడి’పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు వరుస యాక్షన్, కమర్షియల్ సినిమాలతో అలరించిన రవితేజ.. ఈసారి తన రూట్ మార్చినట్లు తాజాగా రిలీజ్ అయిన ఇరుముడి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ, కుటుంబ భావోద్వేగాలు, భక్తి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం మాస్ రాజా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్పై పెద్దగా దృష్టి పెట్టరు. కానీ రవితేజ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన ‘ఇరుముడి’ ట్రైలర్తో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘ఇరుముడి’లో రవితేజ అయ్యప్ప మాల ధరించిన లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. తండ్రి-కూతురు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన గ్లిమ్స్, ట్రైలర్, పాటలు ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గానే కాకుండా భక్తి, కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక రవితేజకు ఈ సినిమా సక్సెస్ కీలకంగా మారింది. ‘ధమాకా’ తర్వాత ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. మరోవైపు దర్శకుడు శివ నిర్వాణకు కూడా విజయం అవసరమే. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి హిట్స్ తర్వాత ‘టక్ జగదీష్’, ‘ఖుషి’ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని శివ నిర్వాణ ‘ఇరుముడి’ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి ఈసారి రవితేజ, శివ నిర్వాణ కలిసి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

