ఆక్సిజన్ దాతలకు బైక్ ఆఫర్ చేస్తున్న హర్షవర్థన్ రాణే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత అందరినీ అల్లాడిస్తోంది. హాస్పిటల్స్ లో తగినంతగా ఆక్సిజన్ నిల్వలు లేకపోవడంతో కొవిడ్ పేషంట్స్ కన్నుమూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ఫిల్మ్ సెలబ్రిటీస్ తమ వంతు సాయం అందిస్తున్నారు. మరికొందరు కరోనాకు సంబంధించిన బాధితుల సమాచారాన్ని వీలైనంత మందికి తెలియచేయడానికి సోషల్ మీడియాను మాధ్యమంగా వాడుకుంటున్నారు. అయితే ప్రముఖ నటుడు హర్షవర్థన్ రాణే మరో అడుగు ముందుకేశాడు. కరోనా బాధితులకు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చి ఆదుకొనేంత స్థోమత తనకు లేదని, అయితే… ఆక్సిజన్ లేక మరణిస్తున్న వారిని చూస్తే ఎంతో బాధ కలుగుతోందని హర్షవర్థన్ రాణే అంటున్నాడు. అందుకే తాను ఎంతో ఇష్టపడే బైక్ ను అమ్మేసి… కొంతమందికైనా ఆక్సిజన్ ను అందించే ప్రయత్నం చేస్తానంటున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన హర్షవర్థన్… ఎవరైతే ఎక్కువమందికి ఆక్సిజన్ అందిస్తారో వారికి తన బైక్ ఇచ్చేస్తానని తెలిపాడు. మరి ఇటు మనిషి ప్రాణాలు కాపాడుతూ, హర్షవర్థన్ రాణే బైక్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే 2010లో ‘తకిట తకిత’తో నటుడిగా తెరంగేట్రమ్ చేసిన హర్షవర్థన్ రాణే పలు తెలుగు చిత్రాలలో నటించిన తర్వాత 2016లో ‘సనమ్ తేరీ కసమ్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ రెండు మూడు సినిమాలలో నటిస్తున్నాడు.
Also Read
- 2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
- Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
- Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
- Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి